Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌కి పిలిచారు... వచ్చేసానుంటున్న రష్మిక

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (11:37 IST)
విజయ్‌ దేవరకొండకు జోడీగా ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో నటిస్తున్న రష్మిక ప్రస్తుతం కార్తీ కథానాయకుడిగా ‘రెమో’ ఫేం బక్కియరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో ఓ సినిమాలోని కథానాయిక పాత్రతో తమిళ పరిశ్రమలోకి అడుగిడబోతోంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా రష్మికకి తొలి తమిళ సినిమా కావడం విశేషం. ఈ చిత్రం షూటింగ్‌ బుధవారంనాడు ప్రారంభమైంది.
 
ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన రష్మిక..  ‘నన్ను నటిగా కన్నడ, తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరించారు. 2019వ సంవత్సరంలో కోలీవుడ్‌కు రమ్మని మీరూ అడిగారు (కోలీవుడ్‌ ఫ్యాన్స్‌), చివరికి వచ్చేసాను. మీకు నా అమితమైన ప్రేమను పంపుతున్నా. కార్తీ, తదితర బృందంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆమె పోస్ట్‌ చేసారు.
 
అదేవిధంగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కథనాయకుడిగా నటిస్తున్న భీష్మ సినిమాలోనూ రష్మిక కథానాయిక పాత్ర పోషించబోతున్నారు. తాజాగా మహేష్‌బాబు-అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు కూడా రష్మిక సంతకం చేసినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా ప్రమాదం- 87 మంది మృతుల డీఎన్ఏ మ్యాచ్ అయ్యాయి..

ఖతార్‍‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్టు.. ఎందుకో తెలుసా?

ఇరాన్‌కు ఆయనే ప్రధాన శత్రువు - డోనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర : నెతన్యాహు

Married Couple: ప్రేమించి పెళ్లి.. నెల తిరగక ముందే రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments