Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోలీ సందర్భంగా యాంకర్ రష్మి రిక్వెస్ట్!

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (18:01 IST)
రష్మి... జబర్దస్త్ షోతో అందరికీ... పరిచయమై తర్వాత తెలుగు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండే రష్మి... తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇటీవల ఓ వీధి కుక్క జబ్బున పడితే దాన్ని చూసిన రష్మి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించి తన వంతు సహాయం అందించి... మూగజీవుల పట్ల తన ప్రేమను చాటుకుంది. 
 
కాగా... ఈరోజు హోలీ సందర్భంగా అందరూ రంగులు పూసుకుంటూ సంబరాలు చేసుకుంటూంటే... రష్మి సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేసింది. ''ప్రతి ఒక్కరికీ నా తరఫున ఒక విన్నపం. కుక్కలపై, ఇతర జంతువులపై రంగులు పూయకండి. పొరపాటున రంగులు వాటి కళ్లలో పడితే అవి చూపు కోల్పోతాయి.  ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్లి మీ శరీరానికి అంటిన రంగులను శుభ్రంగా కడిగేసుకుంటారు. కానీ అవి అలా చేయలేవు'' అంటూ ట్వీట్ చేసి... జంతువులపై తన ప్రేమని మరోసారి నిరూపించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments