Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగబాబుకు ఆ విషయంలో రాంగోపాల్ వర్మ సపోర్ట్

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (14:18 IST)
ఏదైనా కాంట్రవర్శీ వచ్చిందంటే చాలు ఈ డైరెక్టర్ సినిమా తీయడానికి రెడీ అయిపోతాడు. మరెవరో కాదండీ మన ఆర్జీవీనే. నాథురాం గాడ్సే పుట్టినరోజు సందర్భంగా మెగా బ్రదర్ చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపుతోంది. 'గాంధీని చంపడం వలన దేశద్రోహి పేరొస్తుందని తెలిసినా కూడా అనుకున్నది చేశాడు.
 
ఆయన నిజమైన దేశభక్తుడు. అందుకే ఆయన పుట్టిన రోజు పురస్కరించుకుని గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్' అంటూ ట్వీట్ చేసాడు. ఇక ఈ ట్వీట్‌పై సంచలనంగా మారింది, పలువురు రాజకీయ నాయకలు, నెటిజన్లు ఆయనను తప్పుబట్టడంతో వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే మన ఆర్జీవీ మాత్రం నాగబాబుకు మద్దతుగా నిలిచారు. అంతటితో ఆగకుండా మరో బాంబు పేల్చారు.
 
ఆ సమయంలో జరిగిన విషయాలు పరిశీలించి గాడ్సేపై సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. స్వతహాగా గాంధీ అనుచరుడిగా ఉన్న గాడ్సే ఆయనను చంపాల్సి వచ్చింది. ఎందుకు ఈ విషయాన్ని అప్పటి ప్రభుత్వం తొక్కి పెట్టింది. ఇదే కథాంశంతో సినిమా తీస్తానంటూ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

జ్యోతి అలాంటిదని తెలియదు... పాకిస్థాన్‌కు విహారయాత్రకు వెళ్లాను.. : ప్రియాంక సేనాపతి

Rain: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు

Abu Saifullah: లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ అరెస్ట్

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments