Webdunia - Bharat's app for daily news and videos

Install App

1982 మార్చి 29న టీడీపీ పుట్టింది.. 2019 మే 23న చనిపోయింది.... ఆర్జీవీ ట్వీట్

Webdunia
గురువారం, 23 మే 2019 (18:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైనశైలిలో ట్వీట్ చేశారు. ఫ్యాను గాలి సునామీ సృష్టించగా, సైకిల్ టైర్లు పంక్చర్  అయ్యాయని వ్యాఖ్యానించారు. 
 
తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో మరికొన్ని పోస్టులు పెట్టారు. పసుపు కుంకుమ తీసుకొని ఏపీ మహిళలు ఉప్పుకారం రాశారంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా, టీడీపీ పుట్టింది 29 మార్చి 1982న అయితే.. 23 మే, 2019న చచ్చిపోయింది. టీడీపీ చచ్చిపోవడానికి అబద్ధాలు, వెన్నుపోట్లు, అవినీతి, అసమర్థత, వైఎస్.జగన్, నారా లోకేశ్ అంటూ ట్వీట్ చేశారు.
 
అంతేకాకుండా ఏపీ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూనే, ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబు నాయుడుకు తన సానుభూతి తెలుపుతున్నట్టు ఆర్జీవీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఇకపోతే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా చేసుకుని తీసిన 'యాత్ర' సినిమా, ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తీసిన 'ఎన్టీఆర్' బయోపిక్‌లకు లభించినట్టుగానే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయంటూ చమత్కరించారు. అదేసమయంలో రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పైనా సెటైర్‌ వేశారు. ఆయనను ఎవరో బలవంతంగా తీసుకువెళ్తున్నట్లు ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ దాని కింద 'ఇంకెప్పుడూ సర్వే చేయను, నన్ను వదిలేయండి' అంటా కామెంట్స్ పెట్టారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments