Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోధ్‌పూర్ వేదికగా ప్రియాంకా - నిక్ జోనస్ వివాహం

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (13:28 IST)
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్‌లు త్వరలో మూడుముళ్ళ బంధంతో ఒక్కటికానున్నారు. ఇప్పటికే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోగా, త్వరలోనే వీరిద్దరి వివాహాన్ని వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
ఈ వివాహాన్ని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ను పెళ్లి వేదికగా నిర్ణయించారు. నవంబర్ మాసంలో అక్కడి చారిత్రక ఉమేద్‌భవన్‌లో వివాహం జరగనుంది. ఇటీవలే ప్రియాంకచోప్రా, నిక్‌జోనస్ జోధ్‌పూర్‌ను సందర్శించి వివాహ ఏర్పాట్ల గురించి చర్చించారు. పెళ్లికి ఇరు కుటుంబానికి సంబంధించిన రెండొందల మంది అతిథుల్ని మాత్రమే ఆహ్వానిస్తారని సమాచారం. వివాహానంతరం హాలీవుడ్ సెలబ్రిటీస్ కోసం న్యూయార్క్‌లో గ్రాండ్ రిసెప్షన్‌కు సన్నాహాలు చేస్తున్నారు.
 
బాలీవుడ్ ప్రముఖుల కోసం ముంబైలో విందు ఏర్పాటు చేస్తారని సమాచారం. హాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన అనంతరం ప్రియాంకచోప్రా గ్లోబల్‌స్టార్‌గా గుర్తింపును సంపాదించుకుంది. దాంతో ఈ సుందరి పెళ్లి వేడుక కోసం విదేశీ మీడియా సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ నేపథ్యంలో చారిత్రక నగరం జోధ్‌పూర్‌లో పెళ్లి వేదికను ఎంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ ద్వితీయార్థంలో పెళ్లికి తేదిని నిర్ణయించారని తెలుస్తున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments