Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండగే..!

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (22:37 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో సినిమాని ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ సంవత్సరం చివరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
 
ఇదిలా ఉంటే... సాహో సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోకపోవడంతో ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్ లోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌తో ప్రభాస్ ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. పిరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది.
 
ఈ భారీ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో.. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ యు.వి.క్రియేషన్స్ నిర్మాతల్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు. దీంతో ఫ్యాన్స్ ట్రోల్ చేయడం చూసి ఇక లాభం లేదనుకుని ఈ సినిమా నిర్మాతలు ట్విట్టర్లో స్పందిస్తూ... ప్రభాస్ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్ట్స్‌తో క్యూట్ ఛేజ్ సీన్ పూర్తయ్యిందని.. త్వరలో మరో భారీ యూరప్ షెడ్యూల్ ఉందని తెలియచేసింది. 
 
ఈ క్రేజీ మూవీలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్ జాన్ అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత 96 తెలుగు రీమేక్‌కి జాను అని టైటిల్ పెట్టడంతో ప్రభాస్ మూవీకి వేరే టైటిల్ పెట్టనున్నారు. ఈ సినిమా కోసం యు.వి.క్రియేషన్స్ ఓ డియర్, రాధే శ్యామ్ అనే రెండు టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారు. ఈ రెండు టైటిల్స్‌లో ఒక టైటిల్‌ను త్వరలో ఖరారు చేయనున్నట్టు సమాచారం. టైటిల్‌ను ఖరారు చేసి, టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్‌ను ఉగాది రోజున రిలీజ్ చేయనున్నట్టు తెలిసింది. 
 
సో.. ఈ ఉగాది రోజున ప్రభాస్ అభిమానులకు మంచి గిఫ్ట్‌నే ఇవ్వనున్నారు. ప్రభాస్, పూజా హేగ్డేలపై చిత్రీకరించిన లవ్ సీన్స్ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెలియచేసారు. అలాగే కృష్ణంరాజు, ప్రభాస్ లపై చిత్రీకరించనున్న సీన్స్ చాలా బాగుంటాయని.. ఫ్యాన్స్ కు అయితే... పండగే అన్నట్టుగా ఉంటుందని చిత్ర యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. నవంబర్ నుంచి ప్రభాస్ నాగ్ అశ్విన్ తో చేయనున్న మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలిసింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments