Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతు ఏయ్ పిల్లా సాంగ్ నిజంగా బాగుందా..?

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (22:18 IST)
యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. శేఖర్ కమ్ముల సినిమాలు ఎంత సహజంగా ఉంటాయో తెలిసిందే. ఆయన సినిమాలోని పాత్రలు ఆ పాత్రల స్వభావాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమా అయిపోయిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తుంటాయి. ఆ విధంగా శేఖర్ కమ్ముల తన చిత్రాల్లోని పాత్రలను డిజైన్ చేస్తుంటారు.
 
ఆనంద్ సినిమాలోని రూప పాత్ర అయినా.. ఫిదా సినిమాలోని భానుమతి పాత్ర అయినా సరే... ప్రేక్షకులకు అంతలా గుర్తుంది అంటే దానికి కారణం.. ఆయా పాత్రలను శేఖర్ కమ్ముల ఎంతో ప్రేమించి డిజైన్ చేయడమే. అందుకనే శేఖర్ కమ్ముల సినిమా అంటే ప్రేక్షకులకు మక్కువ ఎక్కువ. శేఖర్ కమ్ముల తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాలోని ఏయ్ పిల్లా అంటూ సాగే పాటను రిలీజ్ చేసారు. 
 
ఇందులో ఏ పిల్లా.. పరుగున పోదామా.. ఏ వైపో జంటగ ఉందామో అంటూ సాగిన ఈ పాటను హరిచరణ్ ఆలపించగా.. చైతన్య పింగళి లిరిక్స్ అందించారు. పవన్ హెచ్ స్వరాలను సమకూర్చారు.
 
 ఇది ప్యూర్ లవ్ సాంగ్.. సూపర్‌గా ఉంది అంటూ నెటిజన్లు నుంచి మంచి స్పందన లభిస్తుంది. బ్లాక్ బస్టర్ సాంగ్ ఇది. సినిమా కూడా బ్లాక్‌బస్టర్ ఖాయం. చైతు - సాయి పల్లవి మ్యాజిక్ చేసేసారు... ఇలా ఈ సాంగ్‌కు కామెంట్స్ వస్తున్నాయి. 
 
మరికొంత మంది అయితే.. సాంగ్ స్లోగా ఉందంటున్నారు. ఏది ఏమైనా ఈ సాంగ్ మాత్రం ఫ్యూర్ లవ్ సాంగ్‌గా ఆకట్టుకుంటుంది.  ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది.
 
 మిగిలిన ప్యాచ్ వర్క్ షూటింగ్ చేస్తున్నారు. సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ చేయడంతో ఓ వైపు షూటింగ్ మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 29న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments