Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో మీటింగ్‌లోనే ముగ్గులోకి దింపేందుకు ప్రయత్నించాడు : పాయల్ ఘోష్

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (10:56 IST)
హీరోయిన్ పాయల్ ఘోష్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. గతంలో మీటూ వేదికగా ఆమె పలుమార్లు తనపై జరిగిన లైంగిక వేధింపులను బహిర్గతం చేసింది. తాజాగా మరోమారు ఇదే తరహా కామెంట్స్ చేశారు. సినిమాలో ఛాన్స్ కోసం కలిసినపుడు అనురాగ్య కశ్యపై తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించింది. అయితే, ఇలాంటి దుష్టులకు బాలీవుడ్‌లో ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయన్నారు. 
 
గతంలో నేను దక్షిణాది చిత్రాల్లో నటించాను. జాతీయ అవార్డులు పొందిన దర్శకులతో కలిసి పనిచేశాను. వారి ఏ నాడు కూడా నన్ను ఇబ్బంది పెట్టేలా నడుచుకోలేదు. కానీ, బాలీవుడ్ విషయానికి వస్తే అనురాగ్ కశ్యప్‌తో ఒక్క సినిమాలో కూడా పని చేయలేదు. కానీ, ఆయన నాపై లైంగికదాడికి తెగబడ్డాడు. మూడో మీటింగులోనే ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. అందుకే బాలీవుడ్ కంటే దక్షిణాది చిత్రసీమ గొప్పదని ఎందుకు చెప్పకూడదు అంటూ ఆమె ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం