Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో మరో దారుణం.. వేధింపులు తట్టుకోలేక మరో విద్యార్థిని ఆత్మహత్య

suicide
, సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (09:11 IST)
తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిలపై జరుగుతున్న వేధింపులు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. కాకాతీయ వైద్య వైద్య కాలేజీలో పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి సీనియర్ల వేధింపులు భరించలేక విషపు ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. ఆమె అంత్యక్రియలు కూడా ఇంకా పూర్తికాకముందే తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ బీటెక్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది.
 
ఇది కూడా వరంగల్ జిల్లాలోనే వెలుగు చూసింది. ఈ జిల్లాలోని నర్సంపేటలో జయముఖి ఇంజనీరింగ్ కాలేజీలో తృతీయ సంవత్సరం బీటెక్ చేస్తున్న రక్షిత అనే యువతిని అదే కాలేజీకి చెందిన రాహుల్ అనే యువకుడు గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. కానీ, ఆమె మాత్రం అతని వేధింపులను భరిస్తూనే వచ్చింది. 
 
ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఫోటోలను రాహుల్ సోషల్ మీడియాలో పోస్టే చేశాడు. దీంతో మనస్తాపం చెందిన రక్షిత ఆత్మహత్య చేసుకుంది. వరంగల్‌లోని బంధువుల ఇంటికి వెళ్లిన రక్షిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
 
గతంలో రాహుల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, అతని ప్రవర్తనలో మార్పు రాలేదు కదా మరింతగా ఎక్కువయ్యాయి. శివరాత్రి రోజున భూపాలపల్లికి వెళ్లిన ఆమె కాలేజీకి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పి బయలుదేరింది. కానీ, కాలేజీకి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశఆరు. ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. దీంతో కాలేజీ మాన్పించి బంధువుల ఇంట్లో ఉంచారు. ఈ క్రమంలోనే ఆమె ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పదో తరగతి విద్యార్థిని కోసం గ్రీన్ కారిడార్.. ఎందుకు?