Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్కౌట్లు చేస్తే ఒళ్లు నొప్పులు వచ్చాయని అనుకున్న.. కానీ... స్మిత

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (10:42 IST)
ప్రముఖ పాప్ సింగ స్మిత కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తొలుత ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆ తర్వాత డైరెక్టర్ తేజలకు ఈ వైరస్ సోకింది. 
 
తాజాగా ప్రముఖ గాయని స్మిత కూడా కరోనా పాజిటివ్ వ్యక్తుల జాబితాలో చేరింది. బాగా వర్కౌట్లు చేస్తే ఒళ్లు నొప్పులు వచ్చాయేమో అనుకున్నానని, కానీ వైద్య పరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందని వాపోయింది. తన భర్త శశాంక్‌కు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని స్మిత వెల్లడించింది. 
 
అయితే తమలో పెద్దగా లక్షణాలేవీ లేవని, ఈ మహమ్మారిని తమ శరీరాల్లోంచి తన్ని తరిమేందుకు వేచిచూస్తున్నామని, కరోనా తగ్గితే ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్మిత వివరించింది. తాము ఇంట్లోనే ఉన్నా కరోనా తమ ఇంటి వరకు వచ్చిందని ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments