Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా కాలంలో మహిళలపై అకృత్యాలు.. గిరిజన మహిళపై గ్యాంగ్‌రేప్.. భర్త ముందే..?

Advertiesment
కరోనా కాలంలో మహిళలపై అకృత్యాలు.. గిరిజన మహిళపై గ్యాంగ్‌రేప్.. భర్త ముందే..?
, మంగళవారం, 4 ఆగస్టు 2020 (11:24 IST)
కరోనా కాలంలోనూ మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ గిరిజన మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కలకలం రేపుతోంది. వెలుగోడులో ఓ గిరిజన వివాహితపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
భర్తను లాక్కెళ్ళి చితకబాదిన నలుగురు వ్యక్తులు ఘోరానికి పాల్పడ్డారు. భర్త ఎదుటే భార్యను లాక్కెళ్ళి బలాత్కారం చేశారు నలుగురు వ్యక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వెలుగోడు మండలంలో అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘోరం గురించి తెలుసుకున్న బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. 
 
వెలుగోడు పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించడంతో పాటు బాధితురాలికి న్యాయం చేయాలని మహిళలు కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ.. 48గంటల్లో భారీ వర్షాలు