Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్పత్రి బయట భార్యను పొడిచి చంపేసిన భర్త.. ఎక్కడ?

ఆస్పత్రి బయట భార్యను పొడిచి చంపేసిన భర్త.. ఎక్కడ?
, గురువారం, 30 జులై 2020 (08:45 IST)
ఓ భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. నర్సుగా పనిచేసే కట్టుకున్న భార్యను ఆమె పని చేసే ఆస్పత్రి బయట కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగింది. మృతురాలు, ఆమె భర్త మన భారతీయులే. అదీ కేరళ రాష్ట్రానికి చెందిన వారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని కొట్టాయంకు చెందిన ఓ నర్సు మెరీన్ జాయ్ (26) అనే మహిళ నర్సుగా విద్యాభ్యాసం పూర్తి చేసి, తన భర్త ఫిలిప్ మాథ్యూతో కలిసి అమెరికాకు వెళ్ళింది. అక్కడ కోరల్ స్ప్రింగ్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 
 
అయితే, భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఏమోగానీ... బుధవారం మెరీన్ జాయ్ తన విధులు ముగించుకుని ఆస్పత్రి నుంచి ఇంటికి బయలుదేరింది. అప్పటికే ఆస్పత్రి పార్కింగ్ స్థలంలో ఉన్న భర్త ఫిలిప్ మాథ్యూ కత్తితో దాడిచేసి విచక్షణ రహితంగా పొడిచాడు. 
 
ఈ దాడి ఆస్పత్రి ఎదుటే జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. 
 
కాగా, భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఫిలిప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపటి నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు.. ఎప్పటి వరకు?