Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌రిలేరు నీకెవ్వ‌రు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి గెస్ట్ ఎవ‌రో తెలుసా..?

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (17:51 IST)
సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు.
 
ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను జనవరి 5న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ప్రకటించింది.
 
ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మ‌హేష్ బాబు మాట్లాడుతూ.... “మా ఆహ్వానాన్ని మన్నించి మా సినిమా ప్రీ రిలీజ్‌ సెలబ్రేషన్స్‌కి రావడానికి అంగీకరించినందుకు చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా సినిమా ఫంక్షన్‌కు మీరు రావడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మీ రాకతో మా హ్యాపీనెస్‌ రెట్టింపు అవుతుంది. మా యూనిట్‌ అంతా ఈ ఫంక్షన్‌ను ఓ ల్యాండ్‌మార్క్‌ ఈవెంట్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటుంది. సర్‌, మీ రాక కోసం ఎదురుచూస్తున్నాను” అన్నారు.
 
ఇప్పటికే విడుదలైన మూడు సాంగ్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కాగా, ఈ సోమవారం విడుదల కానున్న నాలుగో పాట క్లాస్‌ సాంగ్‌గా ఉండనుందని ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్‌. ఈ పాట కోసం యూరప్‌లోని అతి పెద్ద ఆర్కెస్ట్రాతో కలిసి మ్యూజిక్‌ కంపోజ్‌ చేశారు దేవి. అక్కడి ఫారిన్‌ మ్యూజిషియన్స్‌తో కలిసి ఈ పాటని ప్రత్యేకంగా రికార్డ్‌ చేశారు.
 
జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైదరాబాద్‌ ఎల్‌.బి స్టేడియంలో ’సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను జరిపి సంక్రాంతి కానుకగా జనవరి 11, 2020న ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments