Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి బాలీవుడ్‌కు ఎందుకు దూరంగా వున్నారు? మెగాస్టార్ ఏం చెప్పారు?

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (18:51 IST)
ముంబైలో గ్రాండ్‌గా జరిగిన సైరా నరసింహారెడ్డి టీజర్ లాంచ్‌లో అక్కడి మీడియా టీమ్‌ను ప్రశ్నల వర్షంలో ముంచెత్తి కావలసిన సమాధానాలను రాబట్టుకుంది. ఈ సందర్భంగా, ప్రతినిధులు చిరుని ఇంత కాలం బాలీవుడ్‌కు దూరంగా ఎందుకు ఉన్నారు అని అడిగారు. వారు అడగడానికి కారణం లేకపోలేదు. చిరు చేసిన చివరి హిందీ స్ట్రెయిట్ మూవీ ది జెంటిల్ మెన్. ఇది 1994లో విడుదలైంది. 
 
అంతకు ముందు ఆజ్ కా గూండా రాజ్, ప్రతిబంద్‌లు కమర్షియల్ సూపర్ సక్సెస్‌ని అందుకుని కొన్ని కేంద్రాల్లో శతదినోత్సవాలు కూడా జరుపుకున్నాయి. ఆ టైంలో చిరంజీవి ఇకపై రెగ్యులర్‌గా హిందీ సినిమాలు చేస్తారనే టాక్ కూడా పత్రికల్లో వచ్చేది. కానీ చిరు ఆ తర్వాత మళ్ళీ వాటి జోలికే వెళ్ళలేదు. అందుకే ఈ సందర్భాన్ని వాడుకుని జర్నలిస్ట్ ఈ ప్రశ్న అడగగా, చిరు సమాధానం ఇచ్చారు. 
 
నిజానికి దానికి స్పష్టమైన కారణం అంటూ ఏదీ లేదని, తెలుగు సినిమాల్లో విపరీతంగా బిజీ కావడం వల్ల ఆ తర్వాత రాజకీయాల్లో కొన్నేళ్లు గడపాల్సి రావడం వంటి కారణాల వల్ల బాలీవుడ్ గురించి ఆలోచించే వ్యవధి లేకపోయిందని చెప్పారు. అయితే ఇప్పుడు ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్ కథ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం ఆకట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments