Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు మనోజ్ ఇంటి జనరేటర్‌లో చక్కెర పోసిన మంచు విష్ణు!!

ఠాగూర్
సోమవారం, 16 డిశెంబరు 2024 (09:53 IST)
మంచు ఇంట్లో చెలరేగిన మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. సినీ నటులు మంచు మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌ల మధ్య ఆస్తి గొడవలు చెలరేగి, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. ఈ క్రమంలో ఓ మీడియా చానల్ ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడంతో ఆయనపై హత్యాయత్న కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ఏక్షణమైనా అరెస్టు కావచ్చు. ఈ వివాదం ఇలా కొనసాగుతూనే ఉండగా, మంచు మనోజ్ తాజా ఆరోపణలతో మరో వివాదం తెరపైకి వచ్చింది.
 
విష్ణు.. తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేయించాడని మనోజ్ ఆరోపిస్తూ ప్రకటన విడుదల చేశారు. తాను సినిమా షూటింగు‌కు వెళ్లిన సమయంలో విష్ణు.. తన అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలతో పాటు కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించి జనరేటర్లలో పంచదార పోయించాడని, దీంతో రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మనోజ్ పేర్కొన్నాడు.
 
జనరేటర్ సమీపంలోనే వాహనాలు, గ్యాస్ కనెక్షన్ ఉన్నాయని, వారి చర్యలతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో భయపడ్డామన్నారు. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నానని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని మనోజ్ ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments