Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘మీ కోసం ఒక దక్షిణాది నటి వచ్చారు. వేచి ఉన్నారు’ - మహానటి సావిత్రి దేశ‌భ‌క్తి

అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన‌ సినిమా ‘మహానటి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ అద్భుతంగా న‌టించి... విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ స‌రికొత్త రికార్డులు సృష

Webdunia
శనివారం, 19 మే 2018 (12:49 IST)
అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన‌ సినిమా ‘మహానటి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ అద్భుతంగా న‌టించి... విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ స‌రికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సావిత్రి జీవితానికి సంబంధించి తెలియని విషయాలెన్నింటినో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ మహానటికి సంబంధించిన అనుభవాలు అభిమానులు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెను ప్రశంసిస్తూ పలు పోస్టులు చేస్తున్నారు.
 
ఈ క్రమంలో సావిత్రి దేశభక్తి, దాతృత్వానికి అద్దం పట్టే అద్భుతమైన సంఘటన ఓ నెటిజన్ పంచుకున్నాడు. ఫోటోతో సహా చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
అది 1965. భారత్, పాక్ మధ్య రెండోసారి యుద్ధం మొదలైంది. వరస యుద్ధాలతో భారత్ ఆర్థికంగా చతికిలబడిపోయింది. అదే సమయంలో యుద్ధంలో భారత్ దగ్గర మందుగుండు సామగ్రి అయిపోయింది. దీంతో నాటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ప్రజలను విరివిగా విరాళాలు ఇవ్వమని దేశ ప్రజలను అభ్యర్థించారు. 
 
1965 సెప్టంబర్‌లో ఒక రోజు ప్రధాని చాంబర్‌లోకి గుమస్తా వచ్చి ‘మీ కోసం ఒక దక్షిణాది నటి వచ్చారు. వేచి ఉన్నారు’ అని చెప్పాడు. శాస్త్రి గారు ఎవరా అని ఆలోచిస్తూనే ‘సరే లోపలికి పంపండి’ అని ఆదేశించారు. 28 ఏళ్ల వయసున్న ఓ యువతి ఒంటి నిండా నగలతో ధగధగలాడుతూ లోపలికి వచ్చి.. ప్రధానికి నమస్కారం చేశారు. శాస్త్రిగారికి తానెవరో పరిచయం చేసుకున్నారు. శాస్త్రి గారు కూడా అభినందనపూర్వకంగా నవ్వారు. తర్వాత ఆ నటి తాను వచ్చిన పని చెబుతూ.. తను ధరించిన ఆభరణాలన్నింటినీ ఒక్కోటి తీసి శాస్త్రి గారి టేబుల్ మీద పెట్టారు. 
 
ఇవన్నీ ప్రధాని నిధికి నా వంతు చిన్న సహాయం అని నవ్వుతూ బదులిచ్చారు. తాళిబొట్టు మాత్రం ఉంచేసుకొని ఒంటిపై నగలన్నీ విరాళంగా ఇచ్చిన ఆమె వంక చూస్తూ.. ప్రధాని ఆశ్చర్యపోయి అలాగే ఉండిపోయారు. కాసేపటి తర్వాత తేరుకొని ఆనందం నిండిన కళ్లతో.. ‘భేటీ నువ్వు మహనీయురాలివమ్మా.. నీ దేశభక్తికి అభినందనలు’ అంటూ శాస్త్రి గారు ఆమెను ప్రశంసించారు. ఆమెతో కరచాలనం చేసి, గౌరవంగా గుమ్మం వరకు వెళ్లి సాగనంపారు. ఆమె ఎవరో కాదు.. మన మహానటి, తెలుగింటి ఆడపడచు సావిత్రి గారు. ఆమె చేసిన దానాల్లో ఇదొకటి. ఆమె దేశభక్తికి, దాతృత్వానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments