Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘మీ కోసం ఒక దక్షిణాది నటి వచ్చారు. వేచి ఉన్నారు’ - మహానటి సావిత్రి దేశ‌భ‌క్తి

అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన‌ సినిమా ‘మహానటి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ అద్భుతంగా న‌టించి... విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ స‌రికొత్త రికార్డులు సృష

Webdunia
శనివారం, 19 మే 2018 (12:49 IST)
అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన‌ సినిమా ‘మహానటి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ అద్భుతంగా న‌టించి... విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ స‌రికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సావిత్రి జీవితానికి సంబంధించి తెలియని విషయాలెన్నింటినో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ మహానటికి సంబంధించిన అనుభవాలు అభిమానులు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెను ప్రశంసిస్తూ పలు పోస్టులు చేస్తున్నారు.
 
ఈ క్రమంలో సావిత్రి దేశభక్తి, దాతృత్వానికి అద్దం పట్టే అద్భుతమైన సంఘటన ఓ నెటిజన్ పంచుకున్నాడు. ఫోటోతో సహా చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
అది 1965. భారత్, పాక్ మధ్య రెండోసారి యుద్ధం మొదలైంది. వరస యుద్ధాలతో భారత్ ఆర్థికంగా చతికిలబడిపోయింది. అదే సమయంలో యుద్ధంలో భారత్ దగ్గర మందుగుండు సామగ్రి అయిపోయింది. దీంతో నాటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ప్రజలను విరివిగా విరాళాలు ఇవ్వమని దేశ ప్రజలను అభ్యర్థించారు. 
 
1965 సెప్టంబర్‌లో ఒక రోజు ప్రధాని చాంబర్‌లోకి గుమస్తా వచ్చి ‘మీ కోసం ఒక దక్షిణాది నటి వచ్చారు. వేచి ఉన్నారు’ అని చెప్పాడు. శాస్త్రి గారు ఎవరా అని ఆలోచిస్తూనే ‘సరే లోపలికి పంపండి’ అని ఆదేశించారు. 28 ఏళ్ల వయసున్న ఓ యువతి ఒంటి నిండా నగలతో ధగధగలాడుతూ లోపలికి వచ్చి.. ప్రధానికి నమస్కారం చేశారు. శాస్త్రిగారికి తానెవరో పరిచయం చేసుకున్నారు. శాస్త్రి గారు కూడా అభినందనపూర్వకంగా నవ్వారు. తర్వాత ఆ నటి తాను వచ్చిన పని చెబుతూ.. తను ధరించిన ఆభరణాలన్నింటినీ ఒక్కోటి తీసి శాస్త్రి గారి టేబుల్ మీద పెట్టారు. 
 
ఇవన్నీ ప్రధాని నిధికి నా వంతు చిన్న సహాయం అని నవ్వుతూ బదులిచ్చారు. తాళిబొట్టు మాత్రం ఉంచేసుకొని ఒంటిపై నగలన్నీ విరాళంగా ఇచ్చిన ఆమె వంక చూస్తూ.. ప్రధాని ఆశ్చర్యపోయి అలాగే ఉండిపోయారు. కాసేపటి తర్వాత తేరుకొని ఆనందం నిండిన కళ్లతో.. ‘భేటీ నువ్వు మహనీయురాలివమ్మా.. నీ దేశభక్తికి అభినందనలు’ అంటూ శాస్త్రి గారు ఆమెను ప్రశంసించారు. ఆమెతో కరచాలనం చేసి, గౌరవంగా గుమ్మం వరకు వెళ్లి సాగనంపారు. ఆమె ఎవరో కాదు.. మన మహానటి, తెలుగింటి ఆడపడచు సావిత్రి గారు. ఆమె చేసిన దానాల్లో ఇదొకటి. ఆమె దేశభక్తికి, దాతృత్వానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments