మా ఎన్నికలు.. హీరోలు ఎందుకు పాల్గొనడం లేదు.. ప్రకాశ్ రాజ్ ప్రశ్న

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (13:03 IST)
మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలోని  కొంతమంది స్టార్ హీరోలను మధ్యాహ్నం భోజనానికి పిలిచి, వారందరిని ఎందుకు మా ఎలక్షన్స్‌లో పాల్గొనడం లేదు అని ప్రశ్నించారు. అంతేకాదు వాళ్ల పర్సనల్ కారణాల వల్ల ఎలక్షన్లకు దూరంగా ఉంటే కచ్చితంగా వాటిని పక్కనపెట్టి, ఎలక్షన్లకు హాజరుకావాలని సూచించారు.
 
అంతేకాదు ప్రతి ఒక్కరు ఈ మా ఎలక్షన్స్‌లో పాల్గొనాలి అని తమ ఓటును వినియోగించాలని కూడా తెలిపాడు. ఇక అంతే కాదు తాను కనుక ఒకవేళ మా ఎలక్షన్స్ లో మా అధ్యక్షపదవిని గనుక పొందినట్లయితే, పది కోట్ల రూపాయలను స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు కేటాయిస్తానని తెలిపాడు. ఇకపోతే మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేసి అధ్యక్షుడిగా గెలిస్తే ఏకంగా భవనాన్ని నిర్మిస్తామని చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
లాక్ డౌన్ సమయంలో ఇలా స్టార్ హీరోలను భోజనానికి పిలవడం ఏంటి..? కరోనా నిబంధనలను పాటించడం లేదు అంటూ ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాను కరోనా నిబంధనలు పాటిస్తూ , కొంతమందిని.. మాత్రమే భోజనానికి ఆహ్వానం పలికినట్లు తెలిపాడు ప్రకాష్ రాజ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

తుఫాను ప్రారంభమైంది... భూమిని సమీపించే కొద్దీ తీవ్రమవుతుంది.. ఏపీఎస్డీఎంఏ

ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తున్న యువతిని కాటేసిన పాము.. మూడు ముక్కలైనా..?

అమరావతిలో ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్.. నారా లోకేష్‌ ప్రధాన ప్రాజెక్ట్ ఇదే

Polavaram: రూ.45,000 కోట్లతో పోలవరం ప్రాజెక్టు పనులు.. జూన్ 2027 నాటికి పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments