Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకల్ నటీనటుల పొట్టకొడుతున్న టీవీ యాజమాన్యం: నాగబాబు ఫైర్

డీవీ
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (13:04 IST)
Nagababu
నాగబాబు కొణిదెల ఇటీవలు పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. కొద్దిరోజుల నాడు టీవీ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతూ, మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. మీకు సరైన పనిలేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ మీ ప్లేస్ లో కన్నడ భాషకు చెందిన నటీనటులు కొత్తగా టీవీ సీరియల్స్ లో రాజ్యమేలుతున్నారు. ఒకరకంగా మీ పొట్ట కొడుతుంది ఎవరో తెలుసుగదా.. అంటూ, మీరంతా ఒకటిగా టీవీ యాజమాన్యంపై మీ బాధలు తెలపండి. వినరు. మరోసారి చెప్పండి. చివరికి దీక్ష చేయండి. నేను కూడా వస్తాను అంటూ వ్యాఖ్యానించారు.
 
నేను టీవీ నిర్మాతగా నటీనటుల సాధక బాధలు తెలుసు. దర్శక నిర్మాతలు పేరుకు మాత్రమే. ఒక సీరియల్ కు పూర్తయ్యేవరకు ఎందరో మారిపోతుంటారు. నటీనటుల ఎంపిక కూడా దర్శకుడి చేతిలో వుండదు. టీవీ యాజమాన్యం చేతిలో వుంటుంది. అందుకే అందరూ వీటిపై పోరాడాల్సిన అవసరం వుంది.
 
అలా గతంలో మా టీవీ ఆఫీసుముందు పోరాటం చేశాం. కానీ అప్పటినుంచి మాకు రెడ్ కార్డ్ లాంటిది క్రియేట్ చేసి మాకు సీరియల్స్ లో అవకాశాలు ఇవ్వడంలేదనీ, మా బతుకులు చాలా దారుణంగా వున్నాయని ఓ నటుడు నాగబాబును ప్రశ్నించడంతో, నాకు తెలుసు మీ బాధలు. అందుకే నేనుకూడా మీ పోరాటంలో భాగస్వామ్యంఅవుతాను. అయితే అందుకు సమయం వుంది. ఆంధ్రలో ఎలక్షన్స్ అయ్యాక టీవీ పై ద్రుష్టిపెడతా అన్నారు. ఈలోగా టీవీ అసోసియేషన్ తరఫున మీరు పోరాటాలు చూస్తూనే వుండండి అంటూ సలహా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో 4 రోజుల పాటు వడగళ్ల వర్షం ... ఈదురు గాలులు వీచే అవకాశం... ఐఎండీ

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

భర్త నాలుకను కొరికేసిన భార్య... ఎందుకో తెలుసా?

Viral Post from NTR Trust: ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహార పదార్థాల జాబితా

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ ప్రియుడుని 20 సార్లు కత్తితో పొడిచిన భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments