Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆదిపురుష్' మూవీ క్రేజ్ : మల్టీప్లెక్స్ మొత్తాన్ని బుక్ చేసిన కృతి సనన్

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (16:35 IST)
ప్రభాస్ - కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వ వహించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 16వ తేదీన విడుదలైంది. ఇందులో కృతి సనన్ జానకీ పాత్రలో నటించారు. సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చినా.. కృతి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందంటూ ప్రేక్షకులు ఆమెను ప్రశంసిస్తున్నారు. 
 
తాజాగా ఈ సినిమా కోసం కృతి ఢిల్లీలోని మల్టీప్లెక్స్‌లో ఓ షోకు మొత్తం టికెట్లు బుక్‌ చేసినట్లు సమాచారం. తాను చదువుకున్న ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ పిల్లల కోసం ఇవి బుక్‌ చేసినట్లు తెలుస్తోంది. వాళ్లతో పాటు కృతి కూడా తన కుటుంబంతో కలిసి మరోసారి సినిమా చూడనుందట. ఈ మేరకు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
ఇక కృతికి తాను చదువుకున్న స్కూల్‌ అంటే ఎంతో అభిమానం. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని తెలుపుతూ ఉంటుంది. ఇటీవల స్కూల్‌ ప్రారంభించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా సోషల్‌ మీడియాలో ప్రత్యేక పోస్ట్‌ పెట్టి అభినందించింది. అలాగే గతంలో వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన ‘భేడియా’ సినిమాను ఆ స్కూల్‌లోనే ప్రమోట్‌ చేసిన విషయం తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments