Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆదిపురుష్' మూవీ క్రేజ్ : మల్టీప్లెక్స్ మొత్తాన్ని బుక్ చేసిన కృతి సనన్

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (16:35 IST)
ప్రభాస్ - కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వ వహించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 16వ తేదీన విడుదలైంది. ఇందులో కృతి సనన్ జానకీ పాత్రలో నటించారు. సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చినా.. కృతి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందంటూ ప్రేక్షకులు ఆమెను ప్రశంసిస్తున్నారు. 
 
తాజాగా ఈ సినిమా కోసం కృతి ఢిల్లీలోని మల్టీప్లెక్స్‌లో ఓ షోకు మొత్తం టికెట్లు బుక్‌ చేసినట్లు సమాచారం. తాను చదువుకున్న ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ పిల్లల కోసం ఇవి బుక్‌ చేసినట్లు తెలుస్తోంది. వాళ్లతో పాటు కృతి కూడా తన కుటుంబంతో కలిసి మరోసారి సినిమా చూడనుందట. ఈ మేరకు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
ఇక కృతికి తాను చదువుకున్న స్కూల్‌ అంటే ఎంతో అభిమానం. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని తెలుపుతూ ఉంటుంది. ఇటీవల స్కూల్‌ ప్రారంభించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా సోషల్‌ మీడియాలో ప్రత్యేక పోస్ట్‌ పెట్టి అభినందించింది. అలాగే గతంలో వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన ‘భేడియా’ సినిమాను ఆ స్కూల్‌లోనే ప్రమోట్‌ చేసిన విషయం తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments