Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ‌వంశీ రుద్రాక్ష ఖ‌రారైంది కానీ... మీడియాకి షాక్ ఇచ్చిన కృష్ణ‌వంశీ..!

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (14:36 IST)
క్రియేటీవ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ న‌క్ష‌త్రం సినిమా వ‌చ్చి వెళ్లింది. చాలా రోజులు కాదు... నెల‌లు సంవ‌త్స‌రాలు కూడా అయ్యాయి కానీ... ఇప్ప‌టివ‌ర‌కు కృష్ణ‌వంశీ త‌దుప‌రి చిత్రం ఏంటి అనేది ఎనౌన్స్ చేయ‌లేదు. బాల‌య్య‌తో రైతు అనే సినిమా చేయ‌నున్న‌ట్టు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి అవి వార్త‌లుగానే మిగ‌లిపోయాయి త‌ప్ప నిజం కాలేదు. ఆ త‌ర్వాత ఆయ‌న రుద్రాక్ష అనే సినిమా తీయ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.. వ‌స్తున్నాయి కానీ.. అఫిషియ‌ల్‌గా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ రాలేదు. 
 
అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించ‌నున్నార‌ని.. స‌మంత ప్ర‌ధాన పాత్ర పోషించ‌నుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. చాలా రోజులు త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ రుద్రాక్ష వార్త‌ల్లోకి వ‌చ్చింది. తాజా వార్త ఏంటంటే.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యింది. 
 
బ్లాక్ బ‌ష్ట‌ర్ ప్రొడ్యూస‌ర్ బండ్ల గ‌ణేష్ ఈ సినిమాని భారీ స్ధాయిలో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మంచి క్రేజ్ వున్న కథానాయికల నుంచి ఒకరిని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. హీరోయిన్ క‌న్ఫ‌ర్మ్ అయితే..  వెంటనే అధికారిక ప్రకటన చేయనున్నట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. మీడియాలో వ‌చ్చిన ఈ వార్త‌లపై కృష్ణ‌వంశీ స్పందించారు. నా గురించి నేనే చెబుతాను. నేను చెప్పే వ‌ర‌కు నా గురించి ఎలాంటి వార్త‌లు వ‌చ్చినా న‌మ్మ‌ద్దు అని చెప్పారు. అంటే... ప్ర‌చారంలో ఉన్న రుద్రాక్ష ఇంకా క‌న్ఫ‌ర్మ్ కాలేద‌ని తెలుస్తుంది. ఈ విధంగా స్పందించి కృష్ణ‌వంశీ మీడియాకి షాక్ ఇచ్చారు. మ‌రి... త‌దుప‌రి చిత్రాన్ని ఎప్పుడు ప్ర‌క‌టిస్తారో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments