Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహం జరిగి 48 గంటలు గడవకముందే విషాదం.. నలుగురు మృతి

Advertiesment
groom
, శనివారం, 22 జూన్ 2019 (15:33 IST)
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం ముక్తాపురం గ్రామంలో పెళ్లి ఇంట విషాదం జరిగింది. నవ వరుడుతో పాటు తల్లిదండ్రులు విద్యుత్ షాక్ తగిలి నలుగురు మృత్యువాత పడ్డారు. ఆ ఇంట వివాహం జరిగి 48 గంటలు కూడా గడవకముందే ఈ దారుణం జరగడంతో కన్నీటి పర్యంత అవుతున్నారు కుటుంబ సభ్యులు. 
 
వర్షం పడుతున్న కారణంగా బయట ఆరేసిన బట్టలు తీయడానికి వెళ్లిన ఈ నలుగురూ ఒకరి తరువాత ఒకరు షాక్‌కు గురై చనిపోయినట్టు తెలుస్తోంది. పెళ్లి పందిరి అలంకరణకు ఫోకస్ లైట్లను అమర్చారు. దానికి సపోర్టుగా ఉండేలా ఒక వైరును బిగించి ఇనుప రాడ్డుకు చుట్టారు. 
 
అదే రాడ్డుకు బట్టలు ఆరేయడానికి మరొక వైరును కూడా బిగించడంతో విద్యుత్ షార్ట్ సర్కూట్ అయింది. వర్షం పడటంతో బట్టలు తీసేందుకు వెళ్లిన వారు ఒకరి తరువాత ఒకరు చనిపోయారు. చనిపోయిన వారిలో పెళ్లి కొడుకు చిందం ప్రవీణ్, పెళ్లి కొడుకు తండ్రి చిందం సాయిలు, పెళ్ళి కొడుకు తల్లి చిందం గంగమ్మ.. పెళ్లి కొడుకు మేనత్త శామల గంగమ్మ నలుగురు చనిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊపిరివుండగానే వృద్ధుడిని శవపరీక్షకు పంపిన వైద్యులు... ఎక్కడ?