Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రైతు"గా ఎన్టీఆర్.. బాలయ్య కోసం కథ రాసి తారక్‌ను దించేశాడు..(video)

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (19:19 IST)
క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన "రంగమార్తాండ" నిర్మాణాంతర పనులతో బిజీగా ఉన్నాడు. మరాఠీ సినిమా "నటసామ్రాట్" కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తయిన తర్వాత కృష్ణవంశీ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. 
 
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ డేట్స్ గురించి ఎంక్వయిరీ చేయడానికి సైతం వెళ్లారు కృష్ణవంశీ. 2006లో ఎన్టీఆర్ మరియు కృష్ణ వంశీ "రాఖీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.
 
మరోవైపు కృష్ణ వంశీ బాలకృష్ణ హీరోగా "రైతు" అనే సినిమా చేయాలనుకున్నారు కానీ ఆ సినిమా కూడా ఇప్పట్లో మొదలయ్యే దాఖలాలు లేవు. అయితే తాజా సమాచారం ప్రకారం కృష్ణవంశీ "రైతు" కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి అదే కథను ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి చేయాలని అనుకుంటున్నారట. 
 
అయితే దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు "రంగమార్తాండ" సినిమాలో ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో విడుదల కానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments