Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రైతు"గా ఎన్టీఆర్.. బాలయ్య కోసం కథ రాసి తారక్‌ను దించేశాడు..(video)

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (19:19 IST)
క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన "రంగమార్తాండ" నిర్మాణాంతర పనులతో బిజీగా ఉన్నాడు. మరాఠీ సినిమా "నటసామ్రాట్" కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తయిన తర్వాత కృష్ణవంశీ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. 
 
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ డేట్స్ గురించి ఎంక్వయిరీ చేయడానికి సైతం వెళ్లారు కృష్ణవంశీ. 2006లో ఎన్టీఆర్ మరియు కృష్ణ వంశీ "రాఖీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.
 
మరోవైపు కృష్ణ వంశీ బాలకృష్ణ హీరోగా "రైతు" అనే సినిమా చేయాలనుకున్నారు కానీ ఆ సినిమా కూడా ఇప్పట్లో మొదలయ్యే దాఖలాలు లేవు. అయితే తాజా సమాచారం ప్రకారం కృష్ణవంశీ "రైతు" కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి అదే కథను ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి చేయాలని అనుకుంటున్నారట. 
 
అయితే దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు "రంగమార్తాండ" సినిమాలో ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో విడుదల కానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో కొత్త బస్సు సర్వీసులు -ఏసీ బస్సులు కూడా..!

నీట్ యూజీ ప్రవేశ పరీక్షల రుద్దు చివరి అస్త్రం : సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

ఏపీలో బీజేపీ.. మిత్రపక్షాలను జీవింపనివ్వదు.. సీపీఐ నారాయణ

గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన టెన్త్ విద్యార్థి.. నడుస్తూ వెళ్తుండగా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments