Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రైతు"గా ఎన్టీఆర్.. బాలయ్య కోసం కథ రాసి తారక్‌ను దించేశాడు..(video)

Krishna Vamsi
Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (19:19 IST)
క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన "రంగమార్తాండ" నిర్మాణాంతర పనులతో బిజీగా ఉన్నాడు. మరాఠీ సినిమా "నటసామ్రాట్" కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తయిన తర్వాత కృష్ణవంశీ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. 
 
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ డేట్స్ గురించి ఎంక్వయిరీ చేయడానికి సైతం వెళ్లారు కృష్ణవంశీ. 2006లో ఎన్టీఆర్ మరియు కృష్ణ వంశీ "రాఖీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.
 
మరోవైపు కృష్ణ వంశీ బాలకృష్ణ హీరోగా "రైతు" అనే సినిమా చేయాలనుకున్నారు కానీ ఆ సినిమా కూడా ఇప్పట్లో మొదలయ్యే దాఖలాలు లేవు. అయితే తాజా సమాచారం ప్రకారం కృష్ణవంశీ "రైతు" కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి అదే కథను ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి చేయాలని అనుకుంటున్నారట. 
 
అయితే దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు "రంగమార్తాండ" సినిమాలో ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో విడుదల కానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments