Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్‌తో ఇంకా టైముంది.. ఇంతలో అనుష్కతో చేసేద్దాం..

సెల్వి
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (19:27 IST)
Anushka_Pawan
జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు క్రిష్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో ఒక చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమా నుండి కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాలని క్రిష్ నిర్ణయించుకున్నాడు. 
 
పవన్ కళ్యాణ్ మొదట ఓజీకి, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్‌కి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ లెక్కన హరి హర వీర మల్లు సెట్స్‌పైకి అడుగు పెట్టడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది. ఇప్పటికే చాలా టైం వెచ్చించడంతో క్రిష్ ఇప్పటికే ఫిమేల్ ఓరియెంటెడ్ స్టోరీని రెడీ చేసి ఫైనల్ వెర్షన్ లాక్ చేసాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. 
 
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్కకు భారీ ఆఫర్ వచ్చింది. త్వరలో రానున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ డ్రామా అని వినిపిస్తోంది. ఇందులో హీరో ఎవరనేది సస్పెన్స్. మరి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
 
ఇటీవల అనుష్క బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు మాస్క్ ధరించి రావడంతో ఆమె ఫోటోలు, వీడియో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments