Webdunia - Bharat's app for daily news and videos

Install App

''క్రాక్''కు షాక్ మార్నింగ్ షో రద్దు..

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (10:35 IST)
మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'క్రాక్‌'. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా విడుదల కాబోతోంది. అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ దాదాపు 1000 థియేటర్లలో ప్రదర్శించబడేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఒక్కసారిగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది.
 
సాధారణంగా భారతదేశంలో విడుదలవ్వడానికంటే ముందే అమెరికాలో ప్రీమియర్ షోలు పడుతూ ఉంటాయి. మన తెలుసు సినిమాలకు ప్రీమియర్ షోల టాక్ చాలా ముఖ్యం. కానీ ఎందుకో ప్రీమియర్ షోలు పడలేదు. శుక్రవారం రాత్రి, జనవరి 8వ తేదీన అమెరికాలో ప్రీమియర్స్ షోలు రద్దు అయ్యాయి. షో రద్దు అయిందని, డబ్బులు రిఫండ్ చేస్తామని తమకు వచ్చిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. 
 
ఇక తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో 'క్రాక్' మార్నింగ్ షో రద్దు అయింది. దీంతో సోషల్ మీడియాలో ఈరోజు సినిమా విడుదల అవుతుందా లేదా అనే డౌట్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఫైనాన్సియల్ క్లియరెన్స్ అయిపోయిందని, 9 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో షోలు పడతాయని 'క్రాక్' పీఆర్ టీమ్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments