Webdunia - Bharat's app for daily news and videos

Install App

''క్రాక్''కు షాక్ మార్నింగ్ షో రద్దు..

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (10:35 IST)
మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'క్రాక్‌'. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా విడుదల కాబోతోంది. అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ దాదాపు 1000 థియేటర్లలో ప్రదర్శించబడేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఒక్కసారిగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది.
 
సాధారణంగా భారతదేశంలో విడుదలవ్వడానికంటే ముందే అమెరికాలో ప్రీమియర్ షోలు పడుతూ ఉంటాయి. మన తెలుసు సినిమాలకు ప్రీమియర్ షోల టాక్ చాలా ముఖ్యం. కానీ ఎందుకో ప్రీమియర్ షోలు పడలేదు. శుక్రవారం రాత్రి, జనవరి 8వ తేదీన అమెరికాలో ప్రీమియర్స్ షోలు రద్దు అయ్యాయి. షో రద్దు అయిందని, డబ్బులు రిఫండ్ చేస్తామని తమకు వచ్చిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. 
 
ఇక తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో 'క్రాక్' మార్నింగ్ షో రద్దు అయింది. దీంతో సోషల్ మీడియాలో ఈరోజు సినిమా విడుదల అవుతుందా లేదా అనే డౌట్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఫైనాన్సియల్ క్లియరెన్స్ అయిపోయిందని, 9 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో షోలు పడతాయని 'క్రాక్' పీఆర్ టీమ్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments