Webdunia - Bharat's app for daily news and videos

Install App

#కైరాతో మరోసారి రాంచరణ్.. మెగాస్టార్ చిరంజీవి మూవీలో..?

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (16:40 IST)
బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ రామ్ చరణ్ సరసన రెండోసారి కలిసి నటించనుంది. ఇప్పటికే వినయ విధేయ రామ చిత్రంలో చెర్రీ కలిసి నటించిన కైరా.. మళ్లీ అతనితో జోడీ కట్టే ఛాన్సుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో చెర్రీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చెర్రీకి కథానాయికగా కైరా అద్వానీని ఎంపిక చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
కాగా కైరా అద్వానీ.. టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన 'విన‌య విధేయ రామ'లోనూ తన అందచందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.
 
అయినప్పటికీ హిందీలో ఈ భామ 'అర్జున్ రెడ్డి' రీమేక్.. 'కబీర్ సింగ్‌'లో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న ''లక్ష్మీబాంబ్‌'' అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోంది. తాజాగా ఈ భామ నటించిన గుడ్ న్యూజ్ సూపర్ హిట్ తెచ్చుకుంది. తాజాగా చెర్రీతోనూ రెండోసారి కలిసి నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నట్లు టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments