Webdunia - Bharat's app for daily news and videos

Install App

#కైరాతో మరోసారి రాంచరణ్.. మెగాస్టార్ చిరంజీవి మూవీలో..?

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (16:40 IST)
బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ రామ్ చరణ్ సరసన రెండోసారి కలిసి నటించనుంది. ఇప్పటికే వినయ విధేయ రామ చిత్రంలో చెర్రీ కలిసి నటించిన కైరా.. మళ్లీ అతనితో జోడీ కట్టే ఛాన్సుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో చెర్రీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చెర్రీకి కథానాయికగా కైరా అద్వానీని ఎంపిక చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
కాగా కైరా అద్వానీ.. టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన 'విన‌య విధేయ రామ'లోనూ తన అందచందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.
 
అయినప్పటికీ హిందీలో ఈ భామ 'అర్జున్ రెడ్డి' రీమేక్.. 'కబీర్ సింగ్‌'లో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న ''లక్ష్మీబాంబ్‌'' అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోంది. తాజాగా ఈ భామ నటించిన గుడ్ న్యూజ్ సూపర్ హిట్ తెచ్చుకుంది. తాజాగా చెర్రీతోనూ రెండోసారి కలిసి నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నట్లు టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments