Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి చూపును కోల్పోయిన కత్తి మహేష్‌.... నేడు ఆపరేషన్

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (12:36 IST)
ఇటీవల నెల్లూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ సినీ నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు వెళుతున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. 
 
ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గురైన వెంటనే ఆయనను నెల్లూరులోని ఓ ఆసుప్రతిలో చేర్పించారు. అనంతరం శనివారం రాత్రి చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు.
 
ప్రమాదంలో కత్తి మహేశ్ రెండు కళ్లు దెబ్బతిన్నాయి. ఎడమ కన్ను చూపు పూర్తిగా పోయిందని వైద్యులు అంటున్నారని ఆయన మేనమామ శ్రీరాములు తెలిపారు. ప్రమాదం వల్ల మెదడులో రక్తస్రావం జరగలేదని... అందువల్ల ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారని వెల్లడించారు. 
 
మరోవైపు ఆయన కళ్లకు ఈరోజు వైద్యులు ఆపరేషన్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం కత్తి మహేశ్ వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు. ఆసుపత్రి వద్ద ఆయన కుటుంబసభ్యులతో పాటు కొందరు బంధువులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments