Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగ‌నా రనౌత్‌కు చుక్కలు-ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ స‌మ‌న్లు జారీ

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (18:29 IST)
సిక్కుల‌ను కించ‌ప‌రిచే రీతిలో బాలీవుడ్ నటి కంగ‌నా రనౌత్ కామెంట్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్‌కు చుక్కెదురైంది. కంగనాకు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ స‌మ‌న్లు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘ‌వ చ‌ద్దా ప్యానెల్ ముందు డిసెంబ‌ర్ ఆరో తేదీన హాజ‌రుకావాలంటూ ఢిల్లీ అసెంబ్లీ ప్యానల్ ఆదేశించింది. 
 
ఇప్పటికే సిక్కుల‌పై అనుచిత రీతిలో వ్యాఖ్య‌లు చేసిదంటూ కంగ‌నా రనౌత్‌పై ముంబైలో కూడా కేసు నమోదైంది. అయితే ఏడాది కాలంగా రైతులు చేసిన ధ‌ర్నాలను ఖ‌లిస్తానీ ఉద్య‌మంగా అభివ‌ర్ణిస్తూ కంగ‌నా ఆరోప‌ణ‌లు చేసింది. 
 
దీంతో సబ్‌ అర్బన్‌ ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఢిల్లీ సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ కంగనాపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆమె కావాల‌నే ఆ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు. 
 
సిక్కులను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన షూ కింద దోమల్ని నలిపివేసినట్లు నలిపివేశారని.. అలాంటి వారే దేశానికి కావాలంటూ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన చేపడుతున్న రైతులను ఖలీస్తానీయులుగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పొంగిన గోదావరి- కృష్ణానదులు.. భద్రాచలం వద్ద మొదటి వరద హెచ్చరిక జారీ

మా అమ్మకు కట్లపొడి, ఆకులు ఇష్టం.. ఉచిత బస్సులో వెళ్తున్నా.. వీడియో వైరల్

Lancet Study: భారత్‌ను వణికిస్తున్న మధుమేహం.. 10మందిలో నలుగురికి ఆ విషయమే తెలియదు!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబడదు.. పల్లా శ్రీనివాసరావు

అమరావతి గురించి ఏడవడం ఆపండి.. వైకాపా నేతలకు కౌంటరిచ్చిన నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments