Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కోర్టులో ఊరట... విదేశాలకు పర్మిషన్ అక్కర్లేదు...

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (11:10 IST)
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టులో ఉపశమనం లభించింది. విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి అక్కర్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమెకు గతంలో విధించిన బెయిల్ షరతును సవరించింది. దీంతో కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లేందుకు జాక్వెలిన్‌కు వెసులుబాటు లభించింది. 
 
దాదాపు రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌ నుంచి జాక్వెలిన్‌ అత్యంత ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో గత ఏడాది ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దానికింద ఆమె విదేశాలకు వెళ్లాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పింది. ఇప్పుడు దానిని సవరించింది. 
 
నిందితురాలు ఇప్పటివరకు ఐదు సందర్భాల్లో విదేశాలకు వెళ్లేముందు ముందస్తు అనుమతి తీసుకున్నారని, ఎక్కడా బెయిల్ ద్వారా లభించిన స్వేచ్చను ఆమె దుర్వినియోగం చేయలేదని ఢిల్లీ పాటియాలా కోర్టు గుర్తించింది. 'దేశాన్ని విడిచే వెళ్లేముందు ముందస్తు అనుమతి గజిబిజిగా ఉండొచ్చు. అలాగే ఒక నటిగా ఆమె అవకాశాలు కోల్పోవడానికి దారితీయొచ్చు' అని వ్యాఖ్యానిస్తూ, తాజాగా బెయిల్ నిబంధనలను సడలించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments