Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కోర్టులో ఊరట... విదేశాలకు పర్మిషన్ అక్కర్లేదు...

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (11:10 IST)
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టులో ఉపశమనం లభించింది. విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి అక్కర్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమెకు గతంలో విధించిన బెయిల్ షరతును సవరించింది. దీంతో కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లేందుకు జాక్వెలిన్‌కు వెసులుబాటు లభించింది. 
 
దాదాపు రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌ నుంచి జాక్వెలిన్‌ అత్యంత ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో గత ఏడాది ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దానికింద ఆమె విదేశాలకు వెళ్లాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పింది. ఇప్పుడు దానిని సవరించింది. 
 
నిందితురాలు ఇప్పటివరకు ఐదు సందర్భాల్లో విదేశాలకు వెళ్లేముందు ముందస్తు అనుమతి తీసుకున్నారని, ఎక్కడా బెయిల్ ద్వారా లభించిన స్వేచ్చను ఆమె దుర్వినియోగం చేయలేదని ఢిల్లీ పాటియాలా కోర్టు గుర్తించింది. 'దేశాన్ని విడిచే వెళ్లేముందు ముందస్తు అనుమతి గజిబిజిగా ఉండొచ్చు. అలాగే ఒక నటిగా ఆమె అవకాశాలు కోల్పోవడానికి దారితీయొచ్చు' అని వ్యాఖ్యానిస్తూ, తాజాగా బెయిల్ నిబంధనలను సడలించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

Hyderabad: కారును ఢీకొన్న వ్యాన్.. నుజ్జు నుజ్జు.. ముగ్గురు మృతి

మహిళతో సహజీవనం... కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ వేధింపులు...

ఎవరైనా కొడితే కొట్టించుకోండి.. ఆ తర్వాత తుక్కు రేగ్గొట్టి సినిమా చూపిద్దాం : కేడర్‌కు జగన్ సూచన

Kurnool: జూలై 2 నుంచి కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments