Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ రిపీట్ కానున్న ఫిదా కాంబో.. వరుణ్ తేజ్.. సాయిపల్లవి..?

Webdunia
మంగళవారం, 18 మే 2021 (12:31 IST)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ఫిదా. ఈ చిత్రం ప్రేక్షకులని ఎంత ఫిదా చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా వరుణ్‌, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకి బాగా నచ్చింది. ఇప్పుడు వీరిద్దరు మరోసారి జంటగా అలరించేందుకు సన్నద్దమైనట్టు తెలుస్తుంది. 
 
ప్రస్తుతం వరుణ్ తేజ్ ఎఫ్‌3, గని చిత్రాలతో బిజీగా ఉండగా, ఈ రెండు పూర్తయ్యాక 'ఛలో, భీష్మ' సినిమాలతో హిట్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుములతో ఓ మూవీ చేయనున్నట్టు సమాచారం.
 
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైందని, వీలైనంత తొందరగానే మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అయితే ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ఇప్పుడు వైరలవుతోంది. 
 
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన ఫిదా ఫేం సాయిపల్లవిని ఎంపిక చేసారని, మరోసారి ఈ జంట తెరపై ఫుల్ ఫన్ క్రియేట్ చేయనున్నారని అంటున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మించనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments