Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్ వద్దు.. టాలీవుడ్డే ముద్దంటున్న హీరోయిన్!

బాలీవుడ్ వద్దు.. టాలీవుడ్డే ముద్దంటున్న హీరోయిన్!
, బుధవారం, 12 మే 2021 (19:37 IST)
సాయిపల్లవి... టాలీవుడ్ హీరోయిన్. ఈమె తమిళనాడుకు చెందిన అమ్మాయి అయినప్పటికీ.. అచ్చతెనుగు అమ్మాయిలా ఉంటుంది. పైగా, తెలుగు చిత్రాలకు అతికినట్టుగా సరిపోయారు. ఈ క్రమంలో టాలీవుడ్‌తో పాటు... కోలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఇటీవల తనకు వచ్చిన ఓ బాలీవుడ్ ప్రాజెక్టును ఆమె సున్నితంగా తిరస్కరించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా "ఛత్రపతి" హిందీ రీమేక్ తెరకెక్కబోతుంది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. 
 
కానీ ఇప్పటివరకు ఎవరూ ఫైనల్ కాలేదని సమాచారం. ఈ క్రమంలో ఇటీవల "ఫిదా" బ్యూటీ సాయి పల్లవిని సంప్రదించారట. అయితే ప్రస్తుతం ఈమె టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ - వినాయక్‌లకు హిందీలో డెబ్యూ సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక హీరోయిన్‌గా ఎవరికి ఛాన్స్ దక్కుతుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైరెక్టర్ తేజకు ఝులక్ ఇచ్చిన ఉప్పెన హీరోయిన్