Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్ సినిమాకు నో చెప్పిన ఫిదా భామ?

బాలీవుడ్ సినిమాకు నో చెప్పిన ఫిదా భామ?
, బుధవారం, 12 మే 2021 (12:33 IST)
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'ఫిదా' సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటు తెలుగు, తమిళం, మళయాళంలో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో వచ్చిన ఆఫర్ ను సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించిందని టాలీవుడ్ టాక్.
 
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ రీమేక్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వి వి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎవరూ ఫైనల్ కాలేదని సమాచారం. 
 
ఈ క్రమంలో ఇటీవల ఫిదా బ్యూటీ సాయి పల్లవి ని సంప్రదించారట. అయితే ప్రస్తుతం ఈమె టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ - వినాయక్‌లకు హిందీలో డెబ్యూ సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాలో నటించేందుకు సాయిపల్లకి రెండు కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినా ఆమె అంగీకరించలేదని టాక్ వస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవికి షాకిచ్చిన తెలుగువాడైన తమిళ దర్శకుడు??