Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్ర హీరోయిన్ కావాలంటున్న రాజమౌళి...

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (13:12 IST)
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం "ట్రిపుల్ ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లతో పాటు ఇతర నటీనటుల ఎంపిక ఇప్పటివరకు జరగలేదు. అయితే, ఈ చిత్రంలో లేడీ ప్రతినాయక పాత్రకు పెళ్లి చేసుకున్న సీనియర్ హీరోయిన్ ప్రియమణిని ఆయన ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఓ క్లారిటీ రావాల్సివుంది. 
 
ఈ నేపథ్యంలో రాజమౌళి దృష్టి కుర్రకారు హీరోయిన్‌పై పడినట్టు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ చిత్రంలో ఈషా రెబ్బా పేరును ఆయన పరిశీలిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ చిత్రంలో హీరోయిన్లుగా కీర్తి సురేష్‌తో పాటు.. అనూ ఇమ్మాన్యుయేల్, రష్మిక మందన్నా తదితరుల పేర్లను ఆయన పరిశీలించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇపుడు ఈషా రెబ్బా పేరు తెరపైకి రావడం గమనార్హం.
 
ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పైగా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు. అందుకే మంచి హీరోయిన్లను ఎంపిక చేసి వారితో అదిరిపోయే స్టెప్పులేసి థియేటర్‌లో హోరెత్తించాలన్న ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఈ చిత్రంలో నటీనటుల పేర్లను కూడా వెల్లడించాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments