Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాని చెప్పింది ఒకటి.. జనాల్లోకి వెళ్లింది మరొకటి : నిర్మాత దిల్ రాజు

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (08:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల వ్యవహారంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాన్నే రేపాయి. ఆయన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలని కోరారు. 
 
తన సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో నాని చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడిన తర్వాత రిలీజైన సినిమా తమదేనని, నాని, తన కాంబినేషన్‌లో వచ్చిన 'వి' సినిమా అని గుర్తుచేశారు. 
 
నాని ఏం చెప్పాడన్న విషయాన్ని ఆయన మనస్సులోకి వెళ్లి చూడాలని, అపుడే ఆయన బాధ ఏంటో అర్థమవుతుందని అన్నారు. తన రెండు సినిమాలు ఓటీటీకీ వెళ్లిన బాధ ఆయనలో ఉందన్నారు. నిజానికి నాని చెప్పిన విషయం ఒక్కటైతే.. జనాల్లోకి వెళ్లింది మరొకటి అని దిల్ రాజు గుర్తుచేశారు. 
 
అలాగే, సినిమా టిక్కెట్ ధరల విషయంలో త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తామని చెప్పారు. అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. సినీ రంగ సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌కు వివరించేందుకు చిత్ర పరిశ్రమ తరపున ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కమిటీలో పరిశ్రమకు చెందిన పెద్దలు సభ్యులుగా ఉంటారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments