Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఇంట్లోకి నేను వెళ్ళడం ట్రస్ పాస్ ఎలా అవుతుంది? దాసరి అరుణ్ కుమార్

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (20:14 IST)
"నా ఇంట్లోకి నేను వెళ్ళటం ట్రస్ పాస్ ఎలా అవుతుంది? నాకు సంబంధించిన కొన్ని గవర్నమెంట్ డాక్యుమెంట్స్ తీసుకోవటానికి వెళ్ళాను... ఎంతసేపు బెల్లు కొట్టినా ఎవరూ గేట్ తీయకపోవడంతో గేట్ దూకి వెళ్ళాను. సొంత ఇంట్లో తలుపులు తీయకపోతే ఎవరైనా చేసే పని అదే. కాబట్టి నేను ఎలాంటి అతిక్రమణకు పాల్పడలేదు" - అంటూ నిన్న మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు దాసరి అరుణ కుమార్.
 
ఈ రోజు ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కాంపౌండ్లో మీడియాతో మాట్లాడుతూ "మా నాన్నగారు దాసరి నారాయణరావు గారు  చనిపోయే ముందు ఎలాంటి వీలునామా రాయలేదు. కాబట్టి ఆయన ఉన్న ఇంటి మీద మా అన్నయ్యకు, నాకు, మా చెల్లికి సమాన హక్కులు ఉన్నాయి. కాబట్టి నా ఇంటికి ఎలాగైనా వెళ్లే హక్కు నాకు ఉంది. కానీ మానసిక స్థితి సరిగా లేని కారణంగా మా అన్న ప్రభు గతంలో కూడా చాలాసార్లు ఇలా మీడియాకు ఎక్కడం... పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం చేశాడు. 
 
ఇప్పుడు కూడా నా డాక్యుమెంట్స్ తీసుకోవడానికి వెళితే ఇలా మీడియాకు ఎక్కి రభస చేశాడు. నా పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నింటిలో అదే అడ్రస్ ఉంది. దానికితోడు నిన్న నాకు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ కొరియర్లో వస్తే దాన్ని కొరియర్ బోయ్ నుండి బలవంతంగా తీసుకున్నారు. కొరియర్ బోయ్ ఆ విషయం నాకు చెప్పగా అది తీసుకుందామని వెళితే ఇలా గొడవ చేసి 100కు డయల్ చేసి పోలీసులను పిలిపించాడు.
 
కొద్దిసేపటికే వచ్చిన జూబ్లీ హిల్స్ ఎస్ఐ నవీన్ గారు గట్టిగా ప్రశ్నించడంతో ఆ డాక్యుమెంట్స్ తెచ్చి ఇచ్చాడు. తాము ఫిర్యాదు చేయగా వచ్చిన పోలీసులే తమను గట్టిగా నిలదీయటంతో ప్రభు, అతని మామ అవి తిరిగి ఇచ్చారు. ఆ ఇంట్లో దాదాపు 15 మందికి పైగా ఎవరెవరో ఉన్నారు. సమయానికి పోలీసులు రావటం వారి కంటే మాకే ప్రొటెక్షన్ అయ్యింది. ఇదీ జరిగింది" అంటూ మొన్న రాత్రి జరిగిన సంఘటన పూర్వాపరాలను మీడియాకు వివరించారు దాసరి అరుణ్ కుమార్.
 
దాసరి గారి మరణం తరువాత అమ్మిన కొన్ని ఆస్తుల తాలూకు తన వాటా ఇవ్వకుండా మీరు మోసం చేశారని ప్రభు ఆరోపిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అని ప్రశ్నిస్తే.. ఏం ఖర్మ... ఏకంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అందుకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని పోలీసులు అడగటంతో మౌనంగా ఉండిపోయాడు. ఇలా సంవత్సరానికి ఒకటి రెండుసార్లు ఏదో ఒక వివాదంతో మీడియాకు ఎక్కడం, పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వడం అతనికి మామూలైపోయింది.
 
ఈ వివాదాన్ని పరిష్కరించడానికి చిరంజీవి గారు ప్రయత్నిస్తున్నారని, అందుకు సి.కళ్యాణ్ గారిని పురమాయించారని చానళ్లలో వచ్చిన వార్త నిజమేనా?
అలాంటిదేమీ లేదండి... మరి ఆ వార్త ఎలా వచ్చిందో తెలీదు... మెగాస్టార్ చిరంజీవి గారిని ఇందులోకి లాగటం భావ్యం కాదు.
 
మోహన్ బాబు గారు, మురళీ మోహన్ గారు, సి.కళ్యాణ్ గారు ఇందులో జోక్యం చేసుకొని పరిష్కరించాలి అని ప్రభు అంటున్నారు... మీకు సమ్మతమేనా?
అంత పెద్దవాళ్ళు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పుడు వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి కదా... వాళ్ళు వచ్చి మా కోసం వెయిట్ చేసే పరిస్థితి కల్పించ కూడదు. గతంలో అలా చేయడంతో వాళ్ళు విసుగు చెంది వదిలేశారు. ఇప్పటికైనా వాళ్ళు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దితే నేను కృతజ్ఞడినై ఉంటాను" అన్నారు దాసరి అరుణ్ కుమార్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డాక్టరైనా నాకీ గతి పడుతుందని అనుకోలేదు మమ్మీ: లేడీ డాక్టర్ ఆత్మహత్య యత్నం (Video)

మెగాస్టార్ మెచ్చిన ఎకో రిక్రియేషనల్ పార్క్, మన హైదరాబాదులో...

మీర్‌పేట హత్య : పోలీసులం సరిగా వివరించలేకపోవచ్చు కానీ, జర్నలిస్టులు సరిగ్గా వివరించగలరు..

అవార్డుల కోసం గద్దర్ పనిచేయలేదు : కుమార్తె వెన్నెల (Video)

వ్యూస్ కోసం బాల్కనీ ఎడ్జ్ పైన బోయ్ ఫ్రెండ్‌తో మోడల్ శృంగారం, కిందపడి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments