సౌత్‌లో రజినీ దర్బార్.. రూ.200 కోట్ల కబ్ల్‌లోకి

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (16:01 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరోమారు సత్తాచాటారు. ఆరు పదుల వయసులోనూ తనతో ఏ ఒక్క కుర్ర హీరో పోటీపడలేరని మరోమారు నిరూపించాడు. ఆయన నటించిన తాజా చిత్రం "దర్బార్". సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి మంచి కలెక్షన్లతో ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. 
 
ముఖ్యంగా, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టగా, తమిళనాడులో మాత్రం రూ.80 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇకపోతే, కేరళలో రూ.8 కోట్లు, కర్ణాటకలో రూ.19 కోట్లు, హిందీ వెర్షన్ ద్వారా రూ.8 కోట్లు, విదేశాల్లో రూ.70 కోట్లు వసూళ్లను రాబట్టింది. దీంతో రజినీ నటించిన మరో చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరినట్టయింది. గతంలో 'రోబో', 'కబాలి', '2.O', 'పేట' చిత్రాలు ఈ జాబితాలో ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments