Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిరంజీవి "వాల్తేరు వీరయ్య"

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (13:57 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. శృతిహాసన్ నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ నెల 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు రోజుల్లో ఏకంగా రూ.108 కోట్లను కొల్లగొట్టింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ చిత్రంతో చిరంజీవితో రవితేజ తోడుకావడంతో పాటు రెండో భాగంలో ఎమోషన్ చేరింది. దీంతో ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకర్షించింది. పైగా, ఈ చిత్రం మొదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు బలం చేకూర్చింది. 
 
ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతిహాసన్ నటించగా, బాలీవుడ్ నటి ఊశ్వరి రౌతలా ఐటమ్ సాంగ్‌లో నటించారు. ప్రకాశ్ రాజ్ .. బాబీ సింహా ప్రతినాయకులుగా కనిపించారు. ప్రస్తుతం వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తున్న ఈ సినిమా, లాంగ్ రన్ లో ఎంతవరకూ రాబడుతుందనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments