పీకల దాకా మద్యం తాగి పోలీసులకు అడ్డంగా బుక్కైన నటి

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (09:37 IST)
మద్యం సేవించి వాహనం నడుపవద్దని పోలీసులు అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సెలెబ్రిటీలతో ప్రచారం చేయిస్తున్నారు. కానీ, అదే సెలెబ్రిటీలు మద్యం సేవించి అడ్డంగా బుక్కవుతున్నారు. తాజాగా ఓ నటి, నృత్య కళాకారిణి, బిగ్‌బాస్ ఫేమ్ గాయత్రీ రఘురామ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడింది. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నై మహానగరంలోని ఎంఆర్‌సీ నగర్‌లో ఓ నక్షత్ర హోటల్ ఉంది. ఇందులో ఇటీవల ఓ పార్టీ జరిగింది. పార్టీకి వెళ్లిన గాయత్రీ రఘురామ్ తిరిగి వస్తున్న వేళ, అభిరామపురం ట్రాఫిక్ పోలీసులు, చెక్ పాయింట్ వద్ద మందు బాబుల కోసం తనిఖీలు చేపట్టారు. 
 
ఆ సమయంలో అటుగా వచ్చిన గాయత్రి కారును ఆపి, బ్రీత్ అనలైజర్‌లోకి గాలిని ఊదాలని కోరగా, ఆమె తాను ఆల్కహాల్ తీసుకున్నట్టు అంగీకరించింది. ఆపై పోలీసులు ఆమెకు తనిఖీలు చేసి, మోతాదుకు మించి మద్యం తీసుకున్నట్టు తేల్చి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె బీఏసీ 185 రావడం గమనార్హం.
 
గాయత్రీ రఘురాంను కారులో చూడటంతో ఆ ప్రాంతమంతా ప్రజలు, అభిమానులతో నిండిపోయింది. చుట్టూ హడావుడి పెరుగుతూ ఉండటంతో, ఆమెను ఇంటివరకూ దింపాలని నిర్ణయించుకున్నామని, ఆపై ఆమె వాహనం డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఏదైనా మొబైల్ కోర్టులో ఆమె రూ.3,500 జరిమానా చెల్లించి డాక్యుమెంట్లు తీసుకోవచ్చని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments