Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలి.. ఎవరు..?

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (20:09 IST)
సినీ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం డిమాండ్ చేసింది. గొర్రెల కాపరులను అవమాన పరిచేలా చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలంది. మోహన్ బాబుపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలంటూ మంగళవారం ఆ సంఘం నేతలు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తొర్రూర్ పోలీస్ స్టేషన్‌లో గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ మరికొందరు నేతలతో కలసి ఫిర్యాదు చేశారు.
 
ఈ సందర్భంగా అశోక్ మాట్లాడారు.. మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోహన్ బాబు ఇష్టారీతిన కామెంట్లు చేశారన్నారు. గొర్రెల కాపరులను అవమాన పరిచేలా వ్యాఖ్యలు చేశారన్నారు. గొర్రెలు మేపుకునే వాడి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉందని, అందరూ చూస్తున్నారని మోహన్ బాబు వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.
 
మోహన్ బాబు కామెంట్లతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించి మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు పోలీసులను కోరామని చెప్పారు. గొర్రెల కాపరుల ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నారు. అంతేకాకుండా గొర్రెల కాపరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో భారీ వర్షాలు.. వరద నీటితో పొంగిపొర్లుతున్న సాగునీటి ప్రాజెక్టులు

ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి... లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు వార్నింగ్

జగన్నాథ్ మహాప్రసాదంలో దేశీ నెయ్యినే వాడుతున్నారా?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీమ్‌లోకి ఆమ్రపాలి

బీహార్ కల్తీసారా ఘటన : 32కు చేరిన మృతులు - అంపశయ్యపై మరికొందరు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments