Webdunia - Bharat's app for daily news and videos

Install App

షెర్లిన్ చోప్రాపై రూ.50కోట్ల పరువునష్టం దావా వేసిన శిల్పా దంపతులు

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (19:50 IST)
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. మరోవైపు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు తనను బెదిరించారంటూ మరో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా, శిల్ప తనపై లైంగిక దాడికి కూడా యత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలో షెర్లిన్‌పై శిల్ప, రాజ్ కుంద్రా న్యాయపరమైన చర్యలకు దిగారు. తమ పరువుకు భంగం కలిగించేలా వ్యహరించిందంటూ షెర్లిన్‌పై రూ. 50 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. 
 
ఈ సందర్భంగా శిల్ప, రాజ్ తరపు న్యాయవాది మాట్లాడుతూ షెర్లిన్ చోప్రా చేసిన ఆరోపణలు అవాస్తవమైనవని చెప్పారు. వారిని కించపరిచి, డబ్బులు డిమాండ్ చేసేందుకే ఆమె ఆరోపణలు చేశారని తెలిపారు. షెర్లిన్‌పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం