Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్‌కు తేరుకోలేని షాకిచ్చిన బాంబే హైకోర్టు

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (16:29 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు బాంబే హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్‌పై విచారణ కోసం ఈ నెల 22వ తేదీన కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. 
 
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాల రద్దుకు దేశంలోని రైతులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఈ రైతులను ఆమె ఉగ్రవాదులతో పోల్చారు. దీంతో కంగనాపై ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్‌లో ఒక సిక్కు సంస్థ ఫిర్యాదు చేసింది. 
 
ఈ పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించి కోర్టు... ఈ నెల మొదట్లో దాఖలు చేశారు. అపుడు కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ నెల 25వ తేదీ వరకు కంగనాను అరెస్టు చేయబోమని పోలీసులు కోర్టుకు తెలిపారు. 
 
ఇపుడు ఈ సమయం సమీపిస్తుండటంతో ఈ నెల 22వ తేదీన విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. దీంతో ఆ రోజన కంగనా రనౌత్ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అయితే, రైతులను తీవ్రవాదులతో పోల్చిన కంగనా.. ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments