Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (15:00 IST)
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అపెక్స్ కోర్టు ఆదేశించింది. దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ ట్రయల్ కోర్టు గతంలో ఆదేశాలు జారీచేసింది. వీటిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. "నా మనసు నిన్ను కోరే నవల" ఆధారంగా "మిస్టర్ ఫర్ఫెక్ట్" అనే సినిమా తీశారంటూ రచయిత్రి శ్యామలాదేవి 2017లో దిల్ రాజుపై కేసు పెట్టారు. 
 
దీంతో పోలీసులు నిర్మాత దిల్ రాజుపై కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జరిగింది. ఇందులోని సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వీటిపై దిల్ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఊరట లభించింది. 
 
కాగా, ఈ యేడాది సంక్రాంతికి ఆయన నిర్మించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఒకటి "గేమ్ ఛేంజర్" కాగా, మరొకటి "సంక్రాంతికి వస్తున్నాం". వీటిలో "సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అదేసమయంలో ఆయన నివాసంలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో వర్షాలే వర్షాలు...

Supreme Court: వీధుల్లో కుక్కలు తిరగడం ఎందుకు? సుప్రీం కోర్టు సీరియస్.. అలెర్ట్ అవసరం (వీడియో)

బంగ్లాదేశ్ బాలికపై 200మంది లైంగిక దాడి.. 3 నెలల పాటు నరకం చూపించారు..

12 యేళ్ల బంగ్లాదేశ్ బాలికపై 200 మంది అఘాయిత్యం - 10 మంది అరెస్టు

కౌలాలంపూర్-చెన్నై కార్గో విమానం ఇంజిన్‌లో మంటలు.. ఎవరికి ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments