Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (15:00 IST)
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అపెక్స్ కోర్టు ఆదేశించింది. దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ ట్రయల్ కోర్టు గతంలో ఆదేశాలు జారీచేసింది. వీటిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. "నా మనసు నిన్ను కోరే నవల" ఆధారంగా "మిస్టర్ ఫర్ఫెక్ట్" అనే సినిమా తీశారంటూ రచయిత్రి శ్యామలాదేవి 2017లో దిల్ రాజుపై కేసు పెట్టారు. 
 
దీంతో పోలీసులు నిర్మాత దిల్ రాజుపై కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జరిగింది. ఇందులోని సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వీటిపై దిల్ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఊరట లభించింది. 
 
కాగా, ఈ యేడాది సంక్రాంతికి ఆయన నిర్మించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఒకటి "గేమ్ ఛేంజర్" కాగా, మరొకటి "సంక్రాంతికి వస్తున్నాం". వీటిలో "సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అదేసమయంలో ఆయన నివాసంలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

సీఐను కొట్టేందుకు వెళ్లిన చెవిరెడ్డి - అడ్డుకున్న డీఎస్సీ

బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం.. నేడు భారీగా వర్షాలు...

ఉత్తరాఖండ్ గౌరీకుండ్‌లో కూలిపోయిన హెలికాప్టర్: ఏడుగురు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments