నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (15:00 IST)
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అపెక్స్ కోర్టు ఆదేశించింది. దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ ట్రయల్ కోర్టు గతంలో ఆదేశాలు జారీచేసింది. వీటిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. "నా మనసు నిన్ను కోరే నవల" ఆధారంగా "మిస్టర్ ఫర్ఫెక్ట్" అనే సినిమా తీశారంటూ రచయిత్రి శ్యామలాదేవి 2017లో దిల్ రాజుపై కేసు పెట్టారు. 
 
దీంతో పోలీసులు నిర్మాత దిల్ రాజుపై కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జరిగింది. ఇందులోని సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వీటిపై దిల్ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఊరట లభించింది. 
 
కాగా, ఈ యేడాది సంక్రాంతికి ఆయన నిర్మించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఒకటి "గేమ్ ఛేంజర్" కాగా, మరొకటి "సంక్రాంతికి వస్తున్నాం". వీటిలో "సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అదేసమయంలో ఆయన నివాసంలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments