Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అర్జున్ రెడ్డి' నటితో హీరో విశాల్ పెళ్లి... వరలక్ష్మి సంగతేంటి?

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (09:48 IST)
కోలీవుడ్ హీరో, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. ఈ చిత్రంలో కీర్తి పాత్రలో నటించిన అమ్మాయి అనీషా రెడ్డి. ఈమెను విశాల్ పెళ్లి చేసుకోనున్నాడు. 
 
ఈ విషయాన్ని విశాల్ తండ్రి జీకే రెడ్డి స్వయంగా వెల్లడించగా, అనీషా రెడ్డి కూడా తమ పెళ్లి వార్తను ధృవీకరించింది. ఇందుకు సంబంధించి తాను, విశాల్ కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇపుడు ఈ ఫోటో వైరల్‌గా మారింది. 
 
అనీషా విషయానికి వస్తే.. హైదరాబాద్‌ బిజినెస్‌మేన్‌ విజయ్‌ రెడ్డి, పద్మజ దంపతుల కుమార్తె. ఈమె 'అర్జున్‌ రెడ్డి', 'పెళ్లి చూపులు' వంటి చిత్రాల్లో నటించారు. 'అర్జున్‌ రెడ్డి' సినిమాలో ఆమె కీర్తి పాత్రని పోషించారు. ఇకపై ఆమె సినిమాల్లో కొనసాగే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా విశాల్‌పై తనకున్న ఇష్టాన్ని, నమ్మకాన్ని కూడా ఆమె వెల్లడించారు. 
 
మరోవైపు, సినీ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్‌తో విశాల్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీరిద్దరి పెళ్లికి శరత్ కుమార్ దంపతులు కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, అవన్ని వట్టి పుకార్లేనని ఈ తాజా ప్రకటనతో తేలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

TVK Vijay: విజయ్ రాజకీయ భవిష్యత్తు ఏమౌతుందో?

Vijay: టీవీకే విజయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? షారూఖ్ ఖాన్ తర్వాత ఆయనే?

కరూర్ తొక్కిసలాట- 40కి చేరిన మృతుల సంఖ్య.. హైకోర్టును ఆశ్రయించిన విజయ్

మూసీ నదిలో నెమ్మదిగా తగ్గిన నీటి మట్టం... ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న జనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments