Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపాల్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరమవుతోందా??

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (18:11 IST)
అమలాపాల్ తాజాగా నటించిన చిత్రం 'ఆడై' సినిమా ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రత్నకుమార్ దర్శకత్వంలో అమలా పాల్ ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని 'ఏ' సర్టిఫికేట్‌ను సంపాదించుకుంది.
 
అయితే... ఈ సినిమాకి 'యు' సర్టిఫికేట్ గానీ.. యూ/ఏ సర్టిఫికేట్ గానీ వస్తుందని భావించిన నిర్మాతలు 'ఏ' సర్టిఫికేట్ రావడంతో కాస్త డీలా పడ్డారట. సర్టిఫికేట్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను దూరం పెడతారేమోనని నిర్మాతలు టెన్షన్‌ పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. 
 
కాగా... ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉందనీ, అందువల్లనే 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చారనీ మరి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అమలాపాల్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కాస్త దూరమయ్యే దాఖలాలే కనబడుతున్నాయని ఊహాగానాలు వినపడుతున్నాయి.
 
మరి ఈ ఊహాగానాలు ఏ మేరకు నిజమో తెలియాలంటే త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేసుకుని, ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments