Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపాల్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరమవుతోందా??

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (18:11 IST)
అమలాపాల్ తాజాగా నటించిన చిత్రం 'ఆడై' సినిమా ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రత్నకుమార్ దర్శకత్వంలో అమలా పాల్ ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని 'ఏ' సర్టిఫికేట్‌ను సంపాదించుకుంది.
 
అయితే... ఈ సినిమాకి 'యు' సర్టిఫికేట్ గానీ.. యూ/ఏ సర్టిఫికేట్ గానీ వస్తుందని భావించిన నిర్మాతలు 'ఏ' సర్టిఫికేట్ రావడంతో కాస్త డీలా పడ్డారట. సర్టిఫికేట్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను దూరం పెడతారేమోనని నిర్మాతలు టెన్షన్‌ పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. 
 
కాగా... ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉందనీ, అందువల్లనే 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చారనీ మరి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అమలాపాల్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కాస్త దూరమయ్యే దాఖలాలే కనబడుతున్నాయని ఊహాగానాలు వినపడుతున్నాయి.
 
మరి ఈ ఊహాగానాలు ఏ మేరకు నిజమో తెలియాలంటే త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేసుకుని, ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments