'సైరా'ను చూసిన తొలి ప్రేక్షకుడు ఆయనే...

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (09:53 IST)
చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం వచ్చే నెల రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. కానీ, ఈ చిత్రం విడుదలకు ముందే ఓ వ్యక్తి తిలకించారు. సైరాను తిలకించిన తొలి ప్రేక్షకుడు ఆయనే. ఆయన పేరు అల్లు అరవింద్. ప్రముఖ నిర్మాత. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లు కాకుండా ఈ సినిమా చూసిన మొదటి ప్రేక్షకుణ్ణి నేనే. ఇంత భారీ బడ్జెట్‌ సినిమా ఎలా ఉంటుందోనన్న భయంతో చూశా. ఒక్కో సీన్‌ చూసి కింద పడిపోయా. కింద నుంచి లేచి చిరంజీవిని కౌగిలించుకున్నా. అంత అద్భుతంగా సినిమా వచ్చింది అని చెప్పుకొచ్చారు. 
 
ఆ తర్వాత చిత్ర దర్శకుడు ఏ.సురేందర్ రెడ్డి స్పందిస్తూ, 'ఈ సినిమా కోసం 250 రోజులు చిత్రబృందమంతా ఓ కుటుంబంలా చాలా కష్టపడ్డాం. వాళ్లందరికీ, తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ను చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చిరంజీవికి, రామ్‌చరణ్‌కి థ్యాంక్స్‌. చరణ్‌ ఎంతో ఫ్రీడమ్‌ ఇచ్చి ముందుకు నడిపించారు అని చెప్పారు. మరో సెన్సేషనల్ డైరెక్టర్ వివి.వినాయక్ మాట్లాడుతూ, 'తెలుగు సినిమా రారాజు, అన్నయ్య చిరంజీవి ఈ సినిమాలో ఉగ్ర నరసింహస్వామిలా ఉన్నారు' అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments