Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమాని వెబ్ ఫిలింలో యముడిగా అజయ్ ఘోష్

డీవీ
గురువారం, 22 ఫిబ్రవరి 2024 (11:35 IST)
Ajay Ghosh, yamudu
రాంబాబు దోమకొండ దర్శకత్వంలో "అభిమాని "అనే వెబ్ ఫిలిం రూపొందుతోంది. 2024 కొత్త సంవత్సరం సందర్భంగా ఆ సినిమా పోస్టర్‌ను సోషల్ మీడియాలో  చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు . ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ట్యాగ్‍లైన్. ఈ పోస్టర్లో యమధర్మరాజుకు సురేష్ కొండేటి మోకాళ్లపై నిల్చుని ఏదో వేడుకుంటున్నట్లు ఉంది. అభిమాని పోస్టర్ చూస్తుంటే.. భూలోకం, యమలోకం చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా రానుందని అర్థమవుతోంది. 
 
ఈ చిత్రానికి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‍కే రహ్మాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను బషీరమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో యముడిగా నటించిన అజయ్ ఘోష్ తాజాగా ప్రసాద్ ల్యాబ్ లో తన డబ్బింగ్ వర్క్ పూర్తి చేశారు.
 
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ "యముడు పాత్ర అనగానే తెలుగు వారికి  కైకాల సత్యనారాయణ గారు గుర్తుకు వస్తారు. అలాంటి మహానుభావులు పోషించిన పాత్ర నాకు దొరకడం నా అదృష్టం. ఈ పాత్రలో నా నటన మీ అందరినీ కట్టిపడేస్తుంది. నాకు ఈ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ కి థాంక్స్. సురేష్ కొండేటి హీరోగా నేను యముడిగా చేయడం చాలా బాగుంది. ఖచ్చితంగా అందరినీ అలరించే సబ్జెక్ట్ ఇది అన్నారు.
 
దర్శకుడు రాంబాబు దోమకొండ మాట్లాడుతూ సినిమా షూటింగ్  పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతన్నాయి, త్వరలో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము అన్నారు .  అనుకున్నదానికంటే అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. మరొక ముఖ్య పాత్ర లో అన్నపూర్ణమ్మ గారి సహకారం మరువలేనిది అన్నారు. ఇంకా ఈ సినిమా లో జై క్రిష్, అక్సాఖాన్, దర్శన్, రెహ్మాన్ ఇతర సీనియర్ నటీనటులు నటించిన ఈ చిత్రానికి కొరియోగ్రఫీ : శ్రీధన్, ఫోటోగ్రఫీ : శేషు డి  నాయుడు,మాటలు : చరణ్, ఎడిటింగ్ : ఇంద్ర కర్నాటి అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments