చిరంజీవి, నాగార్జున ఇలా ఎందుకు చేశారో బాలక్రిష్ణకు ఇప్పటికీ అర్థం కావడం లేదట

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (21:21 IST)
షూటింగ్‌కు అనుమతివ్వండి.. కరోనాతో షూటింగ్‌లు ఆగిపోయాయి. సినిమాలు లేకుంటే క్రిందిస్థాయి వ్యక్తులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఇదంతా చిరంజీవి ఇంట్లో గత కొన్నిరోజుల ముందు ప్రభుత్వానికి.. సినీనటులకు జరిగిన చర్చ. సానుకూలంగా స్పందించిన సినిమాటోగ్రఫీ శాఖామంత్రి షూటింగ్ అనుమతికి ముఖ్యమంత్రితో మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తానన్నారు.
 
ఇదంతా ఒకే. అప్పట్లో జరిగిన సమావేశానికి చిరంజీవి, నాగార్జున, అగ్రనిర్మాతలు మాత్రమే హాజరయ్యారు. కానీ బాలక్రిష్ణ మాత్రం ఆ సమావేశానికి హాజరు కాలేదు. బాలయ్యబాబును ఆ సమావేశానికి అస్సలు ఆహ్వానించలేదట. దీనిపై ఇప్పటికే బాలయ్యబాబు స్పందించారు. సినిమా మీటింగ్ కదా సిఎంతో మాట్లాడతానన్నారు.
 
ఒక అగ్రహీరోగా ఉన్న తనను ప్రభుత్వ, సినిమా పెద్దల సమావేశానికి పిలవకపోవడంపై బాలయ్యబాబు తెగ ఫీలయ్యాడు. దీంతో ఆయన నేరుగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి షూటింగ్ అనుమతిపై విజ్ఞప్తి చేయడానికి సిద్థమైనట్లు తెలుస్తోంది. 
 
మొదట్లో జరిగిన సమావేశంలో కేవలం విజ్ఞప్తి మాత్రమే.. ఆ సమావేశానికి మంత్రి మాత్రమే వచ్చారు. కానీ తను ముఖ్యమంత్రినే కలిసి పర్మిషన్ వచ్చేలా చేస్తానంటున్నారు బాలయ్య బాబు. తనను సమావేశానికి పిలవకపోవడంపై ఇప్పటికే బాలక్రిష్ణ కోపంగా ఉన్నారనే వార్తలు వస్తూనే వున్నాయి. చిరంజీవి, నాగార్జున ఇలా ఎందుకు చేశారో బాలక్రిష్ణకు ఇప్పటికీ అర్థం కావడం లేదట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telugu Man: మానవ అక్రమ రవాణా కేసు.. అరెస్టయిన వారిలో ఒక తెలుగు వ్యక్తి

Arava Sreedhar: అరవ శ్రీధర్‌కు ఊరట.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్

నకిలీ స్టాక్ ట్రేడింగ్ - రూ.85 లక్షల వరకు మోసపోయిన హైదరాబాదీ

తెలంగాణ టూరిజంకు రూ.146.50 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం

హనీమూన్ మర్డర్ కేసు తరహాలో పెళ్లైన మూడు నెలలకే భర్తను చంపేసిన కిలేడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments