Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గీతా ఆర్ట్స్‌కి షాక్ ఇచ్చిన నాగార్జున..!

గీతా ఆర్ట్స్‌కి షాక్ ఇచ్చిన నాగార్జున..!
, గురువారం, 4 జూన్ 2020 (23:09 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సోల్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పైన నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే... లాక్ డౌన్ టైమ్‌లో నాగార్జున తనయుడు అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ని చూసారట. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఇందులో అఖిల్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. అఖిల్ నటించిన మూడు సినిమాలు ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోకపోవడంతో... నాలుగువ సినిమా అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాపై అఖిల్‌తో పాటు అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... లాక్ డౌన్ టైమ్‌లో ఈ సినిమాని నాగార్జున చూసి కొన్ని మార్పులు చేర్పులు చెప్పారట. అంతేకాకుండా.. కొన్ని సీన్స్‌ని మళ్లీ రాసి.. మళ్లీ షూట్ చేయమని చెప్పినట్టు సమాచారం.
 
నాగార్జున నిర్ణయంతో గీతా ఆర్ట్స్ షాక్ అయ్యిందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. రీషూట్ చేయమని చెప్పడం కామన్ కానీ... కొన్ని సీన్స్ మళ్లీ రాయమని.. మళ్లీ ఫ్రెష్‌గా షూట్ చేయమని చెప్పడంతో షాక్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైతేనే...  ఈ సినిమాతో అయినా అఖిల్ సక్సస్ సాధిస్తాడని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రిష్ - సురేందర్ రెడ్డి చేతులు కలిపారు, ఇంతకీ విషయం ఏంటి..?