ర‌ష్మి, సుధీర్‌ల ఉత్తుత్తి పెళ్ళి - ల‌క్ష‌ల్లో పారితోషికం

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (19:43 IST)
suhdeer-rashmi
టెలివిజ‌న్‌లో షోలో సుధీర్, రష్మీ జంట సంద‌డి తెలిసిందే. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ఒక‌రిపై ఒక‌రు సెటైర్లు వేసుకోవ‌డం, దానితో ప్రేక్ష‌కుల‌ను, జ‌డ్జిల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంటారు. ఇది నిర్వాహ‌కుల‌కు బాగా క‌లిసివ‌చ్చిన అంశం. ఇద్ద‌రి మ‌ధ్య వున్న ప్రేమ అనండి, మ‌రోటి అనండి. దాన్ని కేష్ చేసుకునేందుకు ప్ర‌త్యేక‌మైన స్కిట్‌ను త‌యారుచేయ‌మ‌ని చెబుతున్నార‌ట‌. గ‌తంలో ఇలానే వీరిద్ద‌రి ఉత్తుత్తి పెళ్లికి తెలుగు పండ‌గ‌నాడు నానా హ‌డావుడి చేశారు. తాజాగా వీరిద్ద‌రితోపాటు మ‌రో జంట తోడ‌యింది. కేవ‌లం త‌మ‌ను తాము ఐడెంటిఫై చేసుకోవ‌డం కోసం ఆది కూడా ఈ రూటులోనే వచ్చాడు. 
 
ఇక ర‌ష్మి, సుధీర్‌ల గోల రొటీన్ అయిపోయిందిన ఆడియ‌న్స్ పీల‌యిన‌ట్లే నిర్వాహ‌కులు కూడా ఫీల‌య్యిన‌ట్లు తెలిసింది. అందుకే హైప‌ర్ ఆది, దీపిక పిల్లి అనే మ‌రో కొత్త జంట‌ను కూడా తీసుకువ‌చ్చి పెండ్లి సెట‌ప్‌తో గోల‌గోల చేశారు. ఇదంతా చూసేవారికి టైంపాస్‌గా వుంది. ఇది నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. దానికి కార‌ణం సుధీర్ చెప్పిన డైలాగ్‌లే.
 
తన ప్రేమ కోసం వంద సార్లు మరణించైనా ఒక్కసారి జన్మిస్తానంటూ, ఆ సూర్యరశ్మి ఉన్నంతకాలం ఈ సుధీర్ రష్మీ ఉంటారని ఓ కవిత రూపంలో తెలిపాడు. ఇక రష్మీ సిగ్గుపడుతూ నవ్వుతుండగా.. వెంటనే హైపర్ ఆది ఇదిగో రష్మీ, నువ్వు ఆ వోలేటి లక్ష్మీల వయ్యారాలుపోమాకు. సూర్యరశ్మి అంటే పగలే ఉంటుంది. మరి వీడు రాత్రి ఎక్కడ ఉంటాడో అడుగు అని కౌంటర్ వేశాడు.ఇలా సంద‌డి చేసిన ఈ జంట తీసుకున్న పారితోషికం రెండు ల‌క్ష‌ల‌ని తెలిసింది. అందుకే ఆది కూడా పిల్లితో ఈ ప్రోగ్రామ్‌కు స్కిప్ట్ రాసిన‌ట్లు తెలిసింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు త్వ‌ర‌లో రాబోయే ఓ పండుగ‌నాడు మ‌రో జంట‌కూడా పెండ్లి తంతులో క‌నిపిస్తార‌ట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments