Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారక్ అభిమానుల గుండెల్లో గుబులు, ఇంతకీ ఏమైంది..?

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (17:42 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌‌ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
 
ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే... ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. అయితే.. చరణ్ పాత్రకు సంబంధించి టీజర్ రిలీజ్ చేసారు కానీ.. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయలేదు.
 
 కరోనా కారణంగా షూటింగ్ ఆగింది. ఇటీవల ఆర్ఆర్ఆర్ షూటింగ్ స్టార్ట్ చేసారు. ఈ నెల 22న తారక్ పాత్రకు సంబంధించి టీజర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో తారక్ అభిమానులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
 
ఎప్పుడెప్పుడు అక్టోబర్ 22న వస్తుందా టీజర్ రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తుంటే... ఇప్పుడు వర్షాలు కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది. అందుచేత మళ్లీ ఎక్కడ తారక్ పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ ఆగిపోతుందేమో అని తారక్ అభిమానుల గుండెల్లో గుబులు మొదలైందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments