Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు సరసన నటించేందుకు పోటీ.. కైరానా సారానా?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (16:13 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్ల మధ్య పోటీ నెలకొనేలా వుంది. మహేశ్ బాబు తన తదుపరి సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ తరువాత సినిమాను ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. 
 
ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్‌ను తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా బాలీవుడ్ కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి. ఇలా దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ల జాబితాలో కైరా అద్వానీ, సారా అలీఖాన్ పేర్లు ముందు వరుసలో వినిపిస్తున్నాయి. 
 
మహేశ్ బాబు ఇప్పటికే 'భరత్ అనే నేను' సినిమాలో కైరా అద్వానితో జోడీ కట్టేశాడు. అందువలన సారా అలీఖాన్‌ను తీసుకునే దిశగా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 'భరత్ అనే నేను'లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరింది కాబట్టి కైరానే ఖాయం చేసే అవకాశాలు లేకపోలేదని టాక్ వస్తోంది. మరి కైరా, సారా వీరిద్దరిలో ఎవరికి ప్రిన్స్ సరసన నటించే అవకాశం వస్తుందో తెలుసుకోవాలంటే.. వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments