మహేష్ బాబు సరసన నటించేందుకు పోటీ.. కైరానా సారానా?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (16:13 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్ల మధ్య పోటీ నెలకొనేలా వుంది. మహేశ్ బాబు తన తదుపరి సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ తరువాత సినిమాను ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. 
 
ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్‌ను తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా బాలీవుడ్ కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి. ఇలా దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ల జాబితాలో కైరా అద్వానీ, సారా అలీఖాన్ పేర్లు ముందు వరుసలో వినిపిస్తున్నాయి. 
 
మహేశ్ బాబు ఇప్పటికే 'భరత్ అనే నేను' సినిమాలో కైరా అద్వానితో జోడీ కట్టేశాడు. అందువలన సారా అలీఖాన్‌ను తీసుకునే దిశగా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 'భరత్ అనే నేను'లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరింది కాబట్టి కైరానే ఖాయం చేసే అవకాశాలు లేకపోలేదని టాక్ వస్తోంది. మరి కైరా, సారా వీరిద్దరిలో ఎవరికి ప్రిన్స్ సరసన నటించే అవకాశం వస్తుందో తెలుసుకోవాలంటే.. వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా కుమార్తెకు విషపు సూది వేసి చంపేశారు.. ఓ తండ్రి ఫిర్యాదు

ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఎక్కడ?

నడుము నొప్పి తగ్గాలని 8 బతికున్న కప్పలను మింగేసిన వృద్ధురాలు... తర్వాత?

ముప్పు పొంచివుంది.. భారత్‌తో యుద్ధం జరిగితే పాక్ గెలుపు తథ్యం : ఆసిఫ్

జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments