Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు సరసన నటించేందుకు పోటీ.. కైరానా సారానా?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (16:13 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్ల మధ్య పోటీ నెలకొనేలా వుంది. మహేశ్ బాబు తన తదుపరి సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ తరువాత సినిమాను ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. 
 
ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్‌ను తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా బాలీవుడ్ కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి. ఇలా దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ల జాబితాలో కైరా అద్వానీ, సారా అలీఖాన్ పేర్లు ముందు వరుసలో వినిపిస్తున్నాయి. 
 
మహేశ్ బాబు ఇప్పటికే 'భరత్ అనే నేను' సినిమాలో కైరా అద్వానితో జోడీ కట్టేశాడు. అందువలన సారా అలీఖాన్‌ను తీసుకునే దిశగా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 'భరత్ అనే నేను'లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరింది కాబట్టి కైరానే ఖాయం చేసే అవకాశాలు లేకపోలేదని టాక్ వస్తోంది. మరి కైరా, సారా వీరిద్దరిలో ఎవరికి ప్రిన్స్ సరసన నటించే అవకాశం వస్తుందో తెలుసుకోవాలంటే.. వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments